పాముపై అమెరికా యుద్ధం... ఆయుధం పారాసిటమల్
మనం జ్వరం తగ్గడానికి వేసుకునే పారాసిటమల్ను పాములను చంపడానికి వాడుతోంది అమెరికా. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.
అమెరికాకు చెందిన గువామ్ దీవిలో 'బ్రౌన్ ట్రీ స్నేక్' జాతి పాములను చంపేందుకు పారాసిటమల్ను వాడుతోంది అక్కడి ప్రభుత్వం.
గువామ్ దీవిలో ఉండే బ్రౌన్ ట్రీ స్నేక్ జాతి పాములను చంపడానికి 80 మిల్లీ గ్రాముల పారాసిటమల్ను వాడుతోంది అమెరికా.
చనిపోయిన చిన్నచిన్న ఎలుకలకు 80 మిల్లీ గ్రాముల చొప్పున పారాసిటమల్ ఇంజెక్ట్ చేస్తారు. వాటిని కార్డ్బోర్డ్ పారాచూట్లకు అంటించి హెలికాప్టర్ల ద్వారా అడవుల్లోని చెట్ల మీద వదులుతారు.
ఎక్కువగా చెట్లమీదే ఉండే బ్రౌన్ ట్రీ పాములు ఆ కొమ్మలకు చిక్కుకున్న కార్డ్బోర్డ్ పారాచూట్కు ఉండే ఎలుకలను తింటాయి. ఎలుకల్లో ఉండే పారాసిటమల్ వల్ల కొన్ని గంటల్లో ఆ పాములు చనిపోతాయి.
పారాసిటమల్ తినడం వల్లే పాములు చనిపోయాయా లేదా అనే విషయం తెలుసుకునేందుకు కొన్ని ఎలుకల్లో రేడియో ట్రాకర్స్ను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అమర్చుతోంది.
ఇవి కూడా చదవండి:
- లాక్డౌన్లో యూట్యూబ్ చానల్తో లక్షల ఫాలోవర్లు .. 22 దేశాలు చుట్టేసిన యువకుడు
- తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
- కరోనా ఉందని కాన్పు చేయలేదు.. ఆసుపత్రి గేటు వద్ద చెంచు మహిళ ప్రసవం
- పుతిన్ క్రిమియాను రష్యాలో ఎలా విలీనం చేశారు
- వ్యాక్సీన్ తీసుకోని రోగికి గుండె మార్పిడి చికిత్స నిరాకరించిన ఆసుపత్రి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



