పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే కరోనాగా అనుమానించాల్సిందే
కోవిడ్ మహమ్మారి ప్రారంభమై ఏడాదిపైనే అవుతోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.
కరోనావైరస్ చిన్నపిల్లలకు అరుదుగా సోకుతుందనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ బ్రెజిల్లో 1,300 పిల్లలు కోవిడ్ బారినపడి చనిపోయారు.
జెస్సికా రికార్టేకు ఏడాది నిండిన బాబు ఉన్నాడు.
బాబుకు ఒంట్లో నలతగా ఉండడంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.
తనకున్న లక్షణాలు కోవిడ్ లక్షణాలు కాదని చెప్తూ డాక్టర్ ఆ బాబుకు కోవిడ్ పరీక్షలు చేయలేదు.
రెండు నెలల తరువాత ఆ బాబుకు అనారోగ్యం ఎక్కువై చనిపోయాడు.
టీచర్గా పని చేస్తున్న జెస్సికాకు మొదట్లో పిల్లలు పుట్టలేదు. రెండేళ్లపాటూ అన్ని రకాల ప్రయత్నాలు చేసి, ఇంక పిల్లలు పుట్టరని నిశ్చయించుకున్నాక ఈ బాబు పుట్టాడు.
తనకు లూకాస్ అని పేరు పెట్టారు. లూకాస్ అంటే వెలుగు అని అర్థం. తమ జీవితాల్లో వెలుగు నింపాడని బాబుకు ఆ పేరు పెట్టుకున్నామని జెస్సికా చెప్పారు.
లూకాస్ తిండి తినడానికి ఎప్పుడూ మారాం చేయడు. కానీ కొన్ని రోజులుగా సరిగా తినకపోవడంతో జెస్సికాకు అనుమానం వచ్చింది.
బాబుకు పళ్లు వస్తున్నాయేమో అనుకున్నారు. కానీ బాబుకు జ్వరంతో పాటూ, శ్వాస తీసుకోవడం కష్టమయింది. అప్పుడు వెంటనే లూకాస్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోవిడ్ పరీక్షలు చేయాలని డాక్టర్ను అడిగారు.
"ఆక్సీమీటర్తో చెక్ చేస్తే లూకాస్కు ఆక్సిజన్ స్థాయి 86% చూపించింది.
అంటే సాధారణ స్థాయిలోనే ఉంది" అని జెస్సికా చెప్పారు.
లూకాస్కు జ్వరం లేదు. అందుకని డాక్టర్ కోవిడ్ పరీక్షలు చేయించక్కర్లేదని చెప్పారు. అది సాధారణ గొంతు నొప్పి, జలుబు కావొచ్చని అన్నారు.
పిల్లల్లో కోవిడ్ చాలా అరుదుగానే కనిపిస్తోందని చెప్పి బాబుకు కొన్ని యాంటీబయోటిక్స్ ఇచ్చి ఇంటికి పంపేశారు.
లూకాస్కు ప్రైవేట్గా మరోచోట పరీక్ష చేయించే అవకాశం లేకపోయింది.
10 రోజులు యాంటీబయోటిక్స్ వాడిన తరువాత లూకాస్కు మిగతా లక్షణాలు తగ్గాయిగానీ విపరీతంగా నీరసం మాత్రం అలాగే ఉండిపోయింది. దాంతో అది కోవిడ్ కావచ్చనే అనుమానం జెస్సికాకు బలపడింది.
"నేను మా అత్తగారికి, అమ్మావాళ్లకి, బాబును చూసుకునే ఆయాకు చెప్తూనే ఉన్నాను. కానీ, వాళ్లెవరూ నమ్మలేదు. నేను ఊరికే భయపడుతున్నానని, టీవీ చూడొద్దు, న్యూస్ చూడొద్దని నాకు సలహా ఇచ్చారు. కానీ నాకు తెలుసు, నా బాబు మామూలుగా లేడు. తను సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతున్నాడు"
తర్వాత ఏమైందో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- ఎడారి ఇసుక నేలలో పచ్చని పొలం... ఈ అద్భుతం ఎలా సాధ్యం?
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సీన్ వేస్టేజీ ఎక్కువగా ఉందా... ప్రధాని మోదీ ఆ మాట ఎందుకు అన్నారు?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- రైతుల నిరసనలు: ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గొద్దు.. రైతులకు సూచించిన రాహుల్ గాంధీ
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- సింధు నదీజలాల ఒప్పందం వల్ల భారత్ నష్టపోతోందా.. అసలు ఎందుకీ ఒప్పందం చేసుకున్నారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)