యెమెన్: ప్రాణాలు పోయేది బుల్లెట్‌తోనా.. కరోనావైరస్‌తోనా..

మెమెన్ దేశ ప్రజలు ఇప్పటికే యుద్ధం, కలరా, ఆకలితో సతమతం అవుతున్నారు. ఇప్పుడు వారికి మరో మహమ్మారితో పోరాడాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే కరోనావైరస్.

రాజధాని సనాలోని ఒక అత్యుత్తమ ఆసుపత్రిని బీబీసీ సందర్శించింది. అక్కడ 16 మందికి మాత్రమే ఐసీయూ సదుపాయం అందుబాటులో ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

మూడు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వెంటిలేటర్ల సంఖ్య 200 మాత్రమే ఉన్నాయి.

ఈ దేశంలో కరోనావైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోందని, చాలామంది ప్రజలు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అయితే, ఇప్పటికి రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని రెబెల్స్ ఆధ్వర్యంలోని అధికార యంత్రాంగం చెబుతోంది.

తాగేందుకు మంచి పరిశుభ్రమైన నీళ్లే అందుబాటులో లేని ఈ దేశంలో తరచుగా చేతులు కడుక్కోవడం ఎలా సాధ్యం?

మరిన్ని వివరాలు పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)