You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బంగ్లాదేశ్: షేక్ ముజీబుర్ రెహ్మాన్ హత్యకేసులో దోషిని 25 ఏళ్ల తర్వాత ఉరితీత
బంగ్లాదేశ్ స్వాతంత్రపోరాట యోధుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్య కేసులో దోషికి ఉరిశిక్ష అమలు చేశారు.
1975లో జరిగిన ఈ హత్యకేసులో దోషి, మాజీ సైనికాధికారి అబ్దుల్ మాజెద్కు రాజధాని ఢాకాలోని ఓ జైలులో మరణశిక్ష అమలు చేశారు.
25ఏళ్లగా పరారీలో ఉన్న మాజెద్ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.
ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా 1975లో జరిగిన సైనిక తిరుగుబాటులో హత్యకు గురయ్యారు.
బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం వచ్చిన నాలుగేళ్లకే రహ్మాన్ హత్య జరిగింది.
మాజెద్ క్షమాభిక్ష పిటిషన్ ఈవారంలో తిరస్కరణకు గురవడంతో ఆయన్ను ఉరితీశారు.
తిరుగుబాటు, హత్యల తర్వాత కూడా మాజెద్ బంగ్లాదేశ్లోనే ఉన్నారు. కానీ 1996లో హసీనా ప్రధాని కావడంతో ఆయన భారత్కు పరారయ్యారని భావిస్తున్నారు.
తన తండ్రిని హత్య చేసినవారిని ప్రాసిక్యూషన్ చేయకుండా రక్షించే చట్టాలను హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. 1998లో మాజెద్తో పాటు మరో డజను మంది సైనిక అధికారులకు మరణశిక్ష పడింది.
ఈ తీర్పును 2009లో సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఐదుగురికి మరణశిక్ష అమలైంది. గత నెలలో దేశానికి తిరిగివచ్చిన మాజెద్ను బంగ్లాదేశ్ అరెస్టు చేసింది.
ఇవి కూడా చదవండి.
- బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణ హత్యాకాండ
- బంగ్లాదేశ్ యుద్ధంలో భారత పైలట్లు చివరి మూడు నిమిషాల్లో ఏం చేశారు?
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- కరోనావైరస్: ట్రంప్ చెప్పిన ఆరు గొప్పలు.. అందులో నిజానిజాలు
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనావైరస్: అమెరికాలో ఒక్క రోజులోనే 2 వేలకుపైగా మరణాలు... న్యూయార్క్లో మొబైల్ మార్చురీలు
- కరోనావైరస్: లాక్డౌన్ రోజుల్లో మహిళలే ఈ దక్షిణాది రాష్ట్రాలకు 'ఆశ, శ్వాస'
- కరోనావైరస్: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయి-ధారావిలో వైరస్ వ్యాప్తిని అరికట్టేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)