డబ్బుతో పని లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇయాన్ రోజ్
- హోదా, బీబీసీ న్యూస్, బెర్లిన్
మూత్రపిండాల మార్పిడి అవసరమైన రోగులకు దాతలు గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా దొరుకుతున్నారు. ఇందుకు కారణం.. నోబెల్ బహుమతి పొందిన ఆల్విన్ రోత్ అనే ఆర్థికవేత్త.
ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల లభ్యత పెరిగడానికి ఆయనే కారణం.


మూత్రపిండాల దానం మిగతా అవయవాల దానం కంటే భిన్నమైనది. శరీరంలో రెండు మూత్రపిండాలు ఉన్నప్పటికీ ఒక్క మూత్రపిండంతోనూ హాయిగా బతికే అవకాశం ఉండడంతో బతికి ఉన్నవారూ ఒక మూత్రపిండాన్ని దానం చేయొచ్చు.
మూత్రపిండం అవసరమైన రోగులకు కుటుంబసభ్యులు, బంధువులలో ఎవరైనా దానమిచ్చేందుకు ముందుకొచ్చినా అది ఆ రోగికి నప్పని పరిస్థితి ఉండొచ్చు.

కానీ, ప్రొఫెసర్ ఆల్విన్ దాతలు, గ్రహీతలతో నెట్వర్క్ ఏర్పాటుచేసిన తరువాత ఇలాంటి పరిస్థితులు మారిపోయాయి.
ఈ నెట్వర్క్లో కిడ్నీలు సరిపోలని దాత-గ్రహీతల జోడీలు ఉంటాయి. ఈ నెట్వర్క్లోని దాత-గ్రహీతల జోడీలు బదిలీ చేసుకోవడం వల్ల కిడ్నీలు సరిపోలే దాత-గ్రహీతల కొత్త జోడీలు కుదురుతాయి.
ఈ క్రమంలో కిడ్నీలు సరిపోలడం ప్రాతిపదికగా కొత్త దాత-గ్రహీతలు ఏర్పడతాయి. అప్పుడు ఎక్కువ మంది రోగులకు మూత్రపిండాలు లభ్యమవుతాయి.
ప్రపంచంలో ఇరాన్ మినహా మిగతా దేశాల్లో మూత్రపిండాలు విక్రయించడం చట్టవిరుద్ధం. ప్రజల్లో ఎవరైనా రకరకాల కారణాల వల్ల తమ అవయవాలను డబ్బుకోసం విక్రయించుకునే ప్రమాదం ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపు అన్ని దేశాల్లో అవయవాలు అమ్ముకోవడం చట్టవిరుద్ధం.
''ప్రపంచంలో దాదాపు ఎక్కడా ఇలాంటి కిడ్నీ మార్పిడి విధానంలో ధరలకు ప్రమేయం లేకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం'' అని ప్రొఫెసర్ ఆల్విన్ చెప్పారు.
ఈ విధానం వల్ల అమెరికాలో ఏటా వెయ్యి మంది గ్రహీతలు తమకు నప్పే కిడ్నీలున్న దాతలను గుర్తించగలుగుతున్నారని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Nobel
జర్మన్ ఎక్స్చేంజ్
ఆరోగ్య సేవల రంగం భవిష్యత్తుపై చర్చించేందుకు కొందరు నోబెల్ ప్రైజ్ విజేతలు, ఇతర దిగ్గజాలు బెర్లిన్లో సమావేశమైనప్పుడు అక్కడ ప్రొఫెసర్ ఆల్విన్ను కలిశాం. ''మూత్రపిండాల మార్పిడికి సంబంధించిన అధికారిక నియమనిబంధనలను ప్రతి మార్కెట్(దేశం)లో ఎప్పటికప్పుడు సమీక్షించాల''న్నారాయన.
జర్మనీలో దీనిపై నిషేధం ఉండడానికి గల కారణాలను తాను అర్థం చేసుకోగలనని.. మూత్రపిండాల అక్రమ రవాణా జరగొచ్చన్న ఆందోళనలతో అక్కడ నిషేధం విధించారని ప్రొఫెసర్ ఆల్విన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మూత్రపిండాలు అమ్ముకుంటున్నారా?
భవిష్యత్తులో ప్రజలు మూత్రపిండాలు దానం చేసినందుకు ప్రతిఫలం పొందే మార్గాన్నీ యోచిస్తున్నారు.
అధికాదాయ దేశాల్లోని గ్రహీతలకు అల్పాదాయ దేశాల దాతల నుంచి కిడ్నీలు అందించి అందుకు వైద్య ఖర్చులు చెల్లించే ఒక పైలట్ ప్రోగ్రామ్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యతిరేకించింది.
'అధికారిక నిబంధనల అడ్డంకి వల్ల రోగులు చనిపోతే అది సిగ్గుచేటు'' అని ఇలాంటి కార్యక్రమానికి మద్దతు పలుకుతున్న ప్రొఫెసర్ ఆల్విన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భూప్రళయం: డైనోసార్లు అంతమైన ప్రాంతం ఇదే
- తెలంగాణ: బొంగులో కల్లు.. ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..
- ‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు’
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- సూర్యుడు సరిగ్గా మీ ఎదురుగా ఉదయించడం ఎప్పుడైనా చూశారా?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- బాలీవుడ్తో ప్రేమలో పడ్డ జర్మన్ సినిమాటోగ్రాఫర్
- 'సావిత్రికి అభిమానిని.. ఆ తర్వాతే అల్లుడిని!'
- ఫ్రెంచ్ సావిత్రి దేవికి జర్మన్ హిట్లర్కు ఏమిటి సంబంధం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









