ఇథియోపియాలో కూలిన విమానం: ఒక్కరు కూడా బతికిబయటపడలేదు

ఫొటో సోర్స్, Reuters
ఇథియోపియా ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది.
ఇది అడ్డిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 44 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించింది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని విమానయాన సంస్థ వెల్లడించింది.
ఇథియోపియా రాజధానిలో టేకాఫ్ అయిన వెంటనే ఈ ప్రమాదం జరిగిందని సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
విమాన ప్రమాదంలో 149 ప్రయాణికులతో పాటు 8 మంది సిబ్బంది కూడా చనిపోయారని ఇథియోపియా ఎయిర్లైన్స్ ప్రతినిధి చెప్పారు. వీరంతా 33 దేశాలకు చెందిన వారని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.








