You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డమ్మీ తుపాకీతో రెస్టారెంట్కు వచ్చిన 'కిమ్'
ఇదేంటి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్ట్.. ఇలా హాంగ్ కాంగ్లో తిరుగుతున్నారు?
అందరితో ఫొటోలు దిగుతూ ఒకదాని తర్వాత మరొకటిగా ఫ్రైడ్ చికెన్ లాగించేస్తున్నారు.
వీళ్లను చూసిన చాలామంది కిమ్, రోడ్రిగో అని భావించారు. కానీ, పరిశీలనగా చూస్తే... వీరిద్దరూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్ట్లను పోలిన వ్యక్తులు అని తెలుస్తుంది.
కిమ్ లాగా ఉన్న వ్యక్తి పేరు హోవార్డ్ ఎక్స్.
రోడ్రిగో పోలికలతో ఉన్న వ్యక్తి పేరు క్రిసెన్సియో ఎక్స్ట్రీమ్.
డమ్మీ తుపాకులను పట్టుకుని హాంకాంగ్లోని ఓ రెస్టారెంటుకు వచ్చిన వీరిద్దరికీ అక్కడి ప్రజలు స్వాగతం పలికారు.
సెయింట్ జోసెఫ్ చర్చి వద్ద ప్రజలతో కలిసి కిమ్, రోడ్రిగో పోలికలున్న వ్యక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ ఆ రెండు దేశాల అధ్యక్షులు వేసుకునే దుస్తులలాంటివే ధరించి వీధుల్లో సందడి చేస్తున్నారు.
ఒక్కసారిగా రోడ్రిగో వేషధారి చుట్టూ జనం గుమిగూడి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది.
ఇవి కూడా చదవండి.
- అసలు ఎవరీ కిమ్?ఉత్తర కొరియా పాలకుడెలా అయ్యారు?
- ఆ మహిళలే ఉత్తర కొరియా 'రహస్య ఆయుధాలు'!
- దక్షిణ కొరియాలో ‘ఉత్తర కొరియా ఇవాంకా’
- 'ఉత్తర కొరియా జైలులో నేను శవాల్ని పూడ్చిపెట్టాను'
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్లో ఎందుకు కొనసాగుతోంది?
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)