You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: కాబూల్లో అంబులెన్స్ బాంబుతో తాలిబన్ల దాడి.. 100 మంది మృతి
ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో తాలిబన్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం 100 మంది చనిపోగా, మరో 191 మంది గాయాలపాలయ్యారని అధికారులు తెలిపారు.
ఒక అంబులెన్సులో పేలుడు పదార్థాలను నింపి, దానిని.. సాధారణ ప్రజలు వెళ్లేందుకు అవకాశం లేని ఒక వీధిలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టుకు సమీపంగా తీసుకెళ్లి పేల్చటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
యురోపియన్ యూనియన్, హై పీస్ కౌన్సిల్ కార్యాలయాలకు సమీపంలోనే ఈ పేలుడు జరిగింది.
ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు.
గత వారమే కాబూల్లోని ఒక లగ్జరీ హోటల్లోకి తాలిబన్ మిలిటెంట్లు చొరబడి 22 మందిని హతమార్చారు.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతంలో విదేశీ రాయబార కార్యాలయాలు, నగర పోలీసు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని, ఆ సమయంలో చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు.
ఆఫ్గానిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో, పొరుగున ఉన్న పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో కరుడుగట్టిన ఇస్లామిక్ ఉద్యమాన్ని నడిపిస్తున్న తాలిబన్లకు గట్టి పట్టు ఉంది.
ఇవి కూడా చదవండి:
- బౌలింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ
- ‘కశ్మీర్పై భారత్కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
- కాబూల్లో శంషాద్ టీవీ స్టేషన్పై సాయుధుల దాడి
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- హజ్ యాత్రపై మోదీ తప్పు దోవ పట్టిస్తున్నారా?
- పరాజయం చేసే మేలేంటో మీకు తెలుసా!
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- ట్రిపుల్ తలాక్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన 4 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)