You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పార్వతి ఒడిలో శివుడు సేదతీరే అరుదైన శివాలయం విశేషాలు తెలుసా?
చుట్టూ కొండలు, పచ్చటి పొలాలు మధ్యలో తిరుపతి నుంచి నాగలాపురం మీదుగా చెన్నై వెళ్లే ఒక హైవే. ఆ పక్కనే రంగురంగుల గోపురం ఉన్న ఒక ఆలయం. ఆ ఆలయంలోకి వెళ్తే గర్భగుడిలో.. పార్వతీ దేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న స్థితిలో శివుడి విగ్రహం కనిపిస్తుంది.
శివాలయాల్లో ఎక్కడైనా శివుడు మనకు లింగాకారంలో మాత్రమే కనిపిస్తాడు. కానీ ఈ ఆలయంలో శివుడు ఇలా మానవ రూపంలో మిగతా దేవీ దేవతల్లాగే కనిపించడం ఇక్కడ మాత్రమే ఉంది.
ఈ ఆలయం తిరుపతికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు చివర్లోని సురుటిపల్లి గ్రామంలో మరో ఒకటిన్నర కిలోమీటరు వెళ్తే తమిళనాడు వస్తుందనగా రోడ్డు పక్కనే ఆ ఆలయం కనిపిస్తుంది. తమిళనాడులో మొదట వచ్చే ఊతుకోట పట్టణం ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
ఈ ఆలయంలోని శివుడి పేరు పళ్లికొండేశ్వరుడు. పళ్లికొండు అంటే తమిళంలో పడుకోవడం.
ఇవి కూడా చదవండి:
- మహాశివరాత్రి: శైవ ఆలయమైన శ్రీకాళహస్తికి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏంటి
- వారణాసి: మేకలకు సైతం బొట్టు పెట్టి పూజించే ఈ నగరాన్ని చూసిన ఒక విదేశీయుని అనుభవం ఏంటి
- బెలూన్లు, డ్రోన్లు, శాటిలైట్లు... పరాయి దేశాల మీద గూఢచర్యం కోసం వీటిని ఎలా వాడతారు?
- పుతిన్ ప్రొటోకాల్ పక్కనపెట్టి అజిత్ డోభాల్తో భేటీ కావడంపై పాకిస్తాన్లో ఎందుకు చర్చ జరుగుతోంది?
- ‘పది రోజుల పసిగుడ్డుతో సహా శిథిలాల కింద సమాధై.. నాలుగు రోజుల పాటు ఎలా బతికానంటే..’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)