గుజరాత్: ‘కులం పేరుతో బడిలో పిల్లలను వేర్వేరుగా కూర్చోబెట్టిన టీచర్లు...’
లీలా బేన్.. గుజరాత్ లోని బనాస్కాంఠా జిల్లాలోని అంగన్వాడా గ్రామంలో ఉంటారు. ఆమెది వాల్మీకి కులం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలపై వివక్ష చూపుతున్నారని ఆమె అంటున్నారు.
స్కూలు తరగతులు ప్రారంభమయ్యాక ఒక రోజు మధ్యాహ్న భోజన సమయంలో లీలా కుటుంబ సభ్యులు కొన్ని ఫోటోలు తీశారు. ఆ ఫోటోల్లో మిగతా పిల్లలంతా ఒక వైపు ఉంటే, వాల్మీకి కులానికి చెందిన ముగ్గురు పిల్లలు మాత్రం ఒక మూలన కూర్చొని ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది.
‘‘మేం జంతువులం కాదు, మనుషులం. మీ లాగా మేము కూడా మనుషులుగానే పుట్టాం. మీ పిల్లలు చదువులు చదివి జీవితంలో ఎదుగుతున్నారు. మరి మా పిల్లలు ఇంకా ఎన్నాళ్ళు ఈ వెనకబాటుతనంలో మగ్గాలి? 10-15 రోజులుగా మా పిల్లలు బడికి వెళ్ళడంలేదు. ఇంట్లోనే ఉంటున్నారు’’ అని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- నుస్రత్ మీర్జా మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని ఎలా కలిశారు, బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు?
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- వరద తగ్గుతున్నా, ఇంకా భయం భయం... ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి?
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- ‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)