హార్సిలీ హిల్స్: ఈ ఆంధ్రా ఊటీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ గడిపితే టీబీ వ్యాధి నయమవుతుందా

వీడియో క్యాప్షన్, ఈ ఆంధ్రా ఊటీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ గడిపితే టీబీ వ్యాధి నయమవుతుందా?

ఆంధ్రప్రదేశ్‌ అన్నమయ్య జిల్లాలోని హార్సిలీ హిల్స్ ఇవి. ఆంధ్రా ఊటీగా చెప్పుకునే ఈ ప్రాంతం వేసవిలో ప్రజలకు ఉల్లాసాన్ని పంచుతోంది. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పర్యటకులకు చల్లటి విడిదినిస్తోంది.

ఏనుగు మల్లమ్మ కొండ సముద్ర మట్టానికి దాదాపు 1300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కొండపై ఉండే చల్లదనాన్ని, ఈ ప్రాంతం ప్రత్యేకతను బ్రిటిష్ ప్రభుత్వంలో కలెక్టర్‌గా పని చేసిన హార్సిలీ గుర్తించారు. దాంతో ఆయన పేరు మీదుగా దీన్ని హార్సిలీ హిల్స్‌ అని పిలుస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.

ఈ కొండపై వాతావరణం చల్లగా ఉండడంతో హార్సీలీ ఇక్కడే ఎక్కువగా గడిపారని ఉమ్మడి చిత్తూరు జిల్లా టూరిజం శాఖ ఎండీ గిరిధర్ రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)