చూపులేని ఈ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు ఎలా రాశారంటే..
విద్యార్థులందరిలాగే వీరికి కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు చాలా ముఖ్యం. చూపు లేని ఈ విద్యార్థులు ఇటీవలే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.
చిన్నప్పటి నుంచి వీళ్లంతా బ్రెయిలీ లిపిలోనే చదువుతూ, రాస్తూ వచ్చినా, బోర్డు పరీక్షలను వీళ్లే స్వయంగా రాసుకోవడం కుదరదు.
ఎందుకంటే వీళ్లు బ్రెయిలీలో రాసే సమాధానాలను దిద్దే వారే లేరు. దాంతో ఈ విద్యార్థులందరూ స్క్రైబర్ మీద ఆధారపడాల్సి ఉంటుంది.
అయితే తాము చెప్పిన సమాధానాలను వాళ్లు ఎలా రాశారో అనే టెన్షన్ విద్యార్థులందరిలో ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు చర్చ జరుగుతోంది
- మంకీపాక్స్: ఈ పాత వైరస్ కొత్తగా వ్యాపిస్తోంది.. మనం భయపడాలా? అవసరం లేదా?
- డ్రైవర్ మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్ట్ చేస్తాం: కాకినాడ జిల్లా ఎస్పీ
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారా, బౌద్ధ ఆరామాలను కూల్చి గుడులు కట్టారా? చరిత్ర ఏం చెబుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)