You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అనకాపల్లి: తుపాకీతో బెదిరించి బ్యాంకులో రూ. 3.31 లక్షలు దోచుకున్నాడు
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఓ బ్యాంకు దోపిడీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఏప్రిల్ 30 మధ్యాహ్నం కశింకోట మండలం నర్సింగిబిల్లి గ్రామంలోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బందిని తుపాకీతో బెదిరించి ఒక వ్యక్తి రూ.3.31 లక్షలు దోచుకున్నాడు.
హెల్మెట్ ధరించిన వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించడం, క్యాషియర్ వి. ప్రతాప్ రెడ్డిని బెదిరించి డబ్బులు దోచుకెళ్లడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
దోపిడీ జరిగిన టైంలో బ్యాంకులో ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. దోపిడీ చేసిన వ్యక్తి ‘సేఫ్ ఖోలో, చాబీ కిదర్’ అంటూ హిందీలో మాట్లాడినట్లు సిబ్బంది తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఎవరెస్ట్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ శిఖరంపై యుక్రెయిన్ యుద్ధ ప్రభావం
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- మెన్స్ట్రువల్ కప్: నెలసరి సమయంలో దీనిని ఎలా వాడాలి? ఇక శానిటరీ ప్యాడ్ల అవసరం ఉండదా? 5 ప్రశ్నలు, సమాధానాలు..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)