You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముజఫర్నగర్ కిసాన్ మహా పంచాయత్: భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాల దృష్టి
ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్లో కిసాన్ మహా పంచాయత్ నిర్వహిస్తున్నారు.
తరలివస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అటు జిల్లా పరిపాలనా యంత్రాంగం, ఇటు రైతు సంఘాలూ కలిసి ఈ ఏర్పాట్లు చేస్తున్నాయి.
ముజఫర్నగర్లోని జీఐసీ కాలేజీ గ్రౌండ్లో జరగుతున్న ఈ మహా పంచాయత్కు చాలా రాష్ట్రాలకు చెందిన రైతులు రాబోతున్నారని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.
‘‘దేశంలోని నలుమూలల నుంచి రైతులు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు’’ అని భారతీయ కిసాన్ యూనియన్ మీడియా ఇన్ఛార్జి ధర్మేంద్ర మలిక్ బీబీసీతో చెప్పారు.
‘‘దాదాపు 5 లక్షల మంది రైతులు ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారు. ఇక్కడ చోటు సరిపోకపోయినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా రైతులు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశాం. చాలాచోట్ల మైక్లు, ఎల్ఈడీలు సిద్ధంచేశాం’’ అని ఆయన చెప్పారు.
అయితే, ఈ కార్యక్రమానికి 50,000 మంది వరకు వచ్చే అవకాశముందని ముజఫర్నగర్ ఎస్డీఎం సాదర్ దీపక్ కుమార్ అంచనా వేస్తున్నారు.
వేరే ప్రాంతాల నుంచి తరలివస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూసేందుకు దేవాలయాలు, మసీదులు, గురుద్వారాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఏడాది నుంచి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవసాయ చట్టాలతోపాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కిసాన్ మహా పంచాయత్లో దృష్టి సారిస్తారు.
‘‘దేశ వ్యాప్తంగా మా నిరసనలను కొనసాగించేందుకు వ్యూహాలను ఈ కార్యక్రమంలో చర్చిస్తాం’’ అని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి?
- బీబీసీతో అమ్రుల్లా సలేహ్: ‘నేను పారిపోలేదు.. పంజ్షీర్ వ్యాలీలోనే ఉన్నా.. మా పోరాటం ఆగదు’
- VPN అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిజంగానే దీనిని బ్యాన్ చేయాలనుకుంటోందా?
- గల్ఫ్ స్కై: యూఏఈలో అదృశ్యమైన ఈ నౌక ఇరాన్కు ఎలా చేరింది? అసలేం జరిగింది?
- పాకిస్తాన్లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
- పంజ్షీర్లో తాలిబాన్లు, ప్రతిఘటన యోధుల మధ్య హోరాహోరీ పోరాటం.. ‘వందల్లో మృతులు’
- అఫ్గాన్ నుంచి సేనల ఉపసంహరణతో భారత్లో అమెరికా విశ్వసనీయత తగ్గిందా?
- ఆధునిక విలువల వైపు ఉందామా, లేక గడ్డ కట్టిన రాజకీయమతాన్ని ఆహ్వానిద్దామా.-ముస్లిం సమాజంలో చర్చ రేపిన నసీరుద్దీన్ వ్యాఖ్యలు..
- 'ఎండెమిక్' అంటే ఏంటి? కరోనావైరస్ ఎండెమిక్ అయితే ప్రమాదం తగ్గిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)