You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కర్ణాటకలో ఆక్సిజన్ అందక 24 మంది కోవిడ్ రోగుల మృతి.. ముగ్గురే అంటున్న మంత్రి: News Reel
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ఆసుపత్రిలో 24 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు.
కోవిడ్ పేషెంట్లు సహా మొత్తం 24 మంది రోగులు గత 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు.
అయితే, అధికారులు మాత్రం ఈ మరణాలకు ఆక్సిజన్ కొరత కారణం కాదంటున్నారు.
పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తరువాత కారణాలు తెలుస్తాయని.. మృతులకు ఆరోగ్య సమస్యలున్నాయని.. ఆక్సిజన్ కొరత వల్లే చనిపోయారని చెప్పలేమని అధికారులు చెప్పారు.
మరోవైపు కర్ణాటక ఆరోగ్య మంత్రి దీనిపై స్పందిస్తూ ముగ్గురు మాత్రమే ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయారని చెప్పారు.
కరోనావైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్లో మే 5 నుంచి కొత్త ఆంక్షలు, జగన్ ప్రభుత్వం నిర్ణయం
కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది.
కోవిడ్-19 నియంత్రణ చర్యలను సమీక్షించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మే 5 (బుధవారం) నుంచి రాష్ట్రంలో కొన్ని కొత్త ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని షాపులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచాలి.
ఆ తర్వాత అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకూ 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుంది.
ఏపీలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది.
దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 23,290 పాజిటివ్ కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 83 మంది చనిపోయారు.
తెలంగాణలో కూడా గత 24 గంటల్లో 5,695 కొత్త కేసులు నమోదయ్యాయి. 49 మంది చనిపోయారు.
రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను మే 8 వరకూ పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు...
- నోబెల్కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)