You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తమిళనాడు ఎన్ఎల్సీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో పేలుడు... ఆరుగురు మృతి
తమిళనాడు కడలూరు జిల్లాలోని థర్మల్ విద్యుత్ కేంద్రంలో బుధవారం ప్రమాదం సంభవించింది. దీంతో ఆరుగురు మృత్యువాతపడ్డారు. 17 మందికి గాయాలయ్యాయి.
నైవేలీ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఐదో బాయిలర్లో విస్ఫోటం సంభవించడంతో ఇక్కడ మంటలు చెలరేగాయి. గాయపడిన వారిని నైవేలీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరిని అత్యవసర చికిత్స కోసం చెన్నైకి అంబులెన్స్లలో పంపిస్తున్నారు.
ఘటన స్థలంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక విభాగం ప్రయత్నిస్తోంది.
మంటల వల్ల రెండో థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనులను పూర్తిగా నిలిపివేశారు.
మే 7న ఇక్కడ ఆరో విభాగంలో మంటలు చెలరేగడంతో ఐదుగురు మరణించారు. గత రెండు నెలల్లో నైవేలీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఇలా ప్రమాదాలు జరగడం ఇది మూడోసారి.
మరోవైపు మృతదేహాలను ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లకుండా సిబ్బంది నిరసన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పోలీసులు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందిని ఇక్కడ మోహరించారు.
ఇవి కూడా చదవండి.
- విశాఖపట్నం గ్యాస్ లీకేజి: ‘‘నాకు పరిహారం వద్దు.. నాకు నా ఇద్దరు పిల్లల్ని, నా భర్తను ఇవ్వండి’’
- వైజాగ్ గ్యాస్ లీక్: ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? దర్యాప్తు నివేదిక ఎప్పుడు వస్తుంది?
- కరోనావైరస్: ‘ఈ సంక్షోభంలో ఖండాలు దాటుతూ చేసిన ప్రయాణాలు నాకు ఏం నేర్పాయంటే...’ - బ్లాగ్
- WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’
- రష్యా ఖచటుర్యాన్ సిస్టర్స్- తండ్రిని చంపిన కూతుళ్లు.. ‘ఆత్మరక్షణ కోసం’ చేసిన హత్య కాదా?
- కరోనావైరస్ రోగులకు చికిత్స అందించే ఓ నర్సు, ఆమె కుమారుడు.. ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచించారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)