దిల్లీ - హైదరాబాద్/వైజాగ్ విమాన ప్రయాణం ఛార్జీ కనిష్ఠం రూ.3,500, గరిష్ఠం రూ.10 వేలు

మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన దేశీయ విమాన ప్రయాణాలు ఈనెల 25వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.

కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే విమానాలను నడుపుతోంది.

ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ప్రయాణించే వారి నుంచి వసూలు చేయాల్సిన ఛార్జీలను కూడా పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) గురువారం ప్రకటించారు. ప్రయాణ సమయాన్ని బట్టి ఈ ధరలను నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

డీజీసీఏ సర్క్యులర్‌లో దేశంలోని విమాన మార్గాలను ఏడు సెక్టార్లుగా విభజించారు. ఆయా సెక్టార్లు, వాటిలో ప్రయాణ ఛార్జీలు ఇలా ఉన్నాయి.

  • సెక్టార్‌ ఏ - కనిష్ఠ ఛార్జీ రూ.2 వేలు, గరిష్ఠ ఛార్జీ 6 వేలు
  • సెక్టార్‌ బీ - కనిష్ఠ ఛార్జీ రూ.2,500, గరిష్ఠ ఛార్జీ 7,500
  • సెక్టార్‌ సీ - కనిష్ఠ ఛార్జీ రూ.3 వేలు, గరిష్ఠ ఛార్జీ 9 వేలు
  • సెక్టార్‌ డీ - కనిష్ఠ ఛార్జీ రూ.3,500, గరిష్ఠ ఛార్జీ 10 వేలు
  • సెక్టార్‌ ఈ - కనిష్ఠ ఛార్జీ రూ.4,500, గరిష్ఠ ఛార్జీ 13 వేలు
  • సెక్టార్‌ ఎఫ్ - కనిష్ఠ ఛార్జీ రూ. 5,500, గరిష్ఠ ఛార్జీ 15,700
  • సెక్టార్‌ జీ - కనిష్ఠ ఛార్జీ రూ. 6,500, గరిష్ఠ ఛార్జీ 18,600

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్ నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఈ సర్క్యులర్‌ను బట్టి తెలుస్తోంది.

దిల్లీ నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ మార్గాలను డీ సెక్టార్‌లో పేర్కొన్నారు. అంటే దిల్లీ నుంచి హైదరాబాద్ లేదా వైజాగ్ అలాగే హైదరాబాద్, వైజాగ్ నుంచి దిల్లీకి విమాన ప్రయాణానికి ఛార్జీ కనిష్ఠంగా రూ.3,500, గరిష్ఠంగా రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

సెక్టార్ల వారీగా ఏఏ నగరాలకు హైదరాబాద్, వైజాగ్‌లకు నుంచి విమానాలు ప్రయాణిస్తున్నాయంటే..

సెక్టార్‌ బీ - కనిష్ఠ ఛార్జీ రూ.2,500, గరిష్ఠ ఛార్జీ 7,500

హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, గోవా, ఇండోర్, కోచి, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, వైజాగ్

అలాగే, పూణే నుంచి హైదరాబాద్, మంగళూరు నుంచి హైదరాబాద్

రాయ్‌పూర్ నుంచి వైజాగ్

సెక్టార్‌ సీ - కనిష్ఠ ఛార్జీ రూ.3 వేలు, గరిష్ఠ ఛార్జీ 9 వేలు

హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, కోల్‌కతా, పూణే, త్రివేండ్రం

బెంగళూరు నుంచి వైజాగ్

కోయంబత్తూరు నుంచి హైదరాబాద్

కొచ్చి నుంచి హైదరాబాద్

కోల్‌కతా నుంచి వైజాగ్

తిరువనంతపురం నుంచి హైదరాబాద్

సెక్టార్‌ డీ - కనిష్ఠ ఛార్జీ రూ.3,500, గరిష్ఠ ఛార్జీ 10 వేలు

భువనేశ్వర్ నుంచి హైదరాబాద్

దిల్లీ నుంచి హైదరాబాద్, వైజాగ్

హైదరాబాద్ నుంచి అమృత్‌సర్, దిల్లీ, జైపూర్, లక్నో, పాట్నా, రాంచీ

జైపూర్ నుంచి హైదరాబాద్,

కోల్‌కతా నుంచి హైదరాబాద్,

లక్నో నుంచి హైదరాబాద్

పాట్నా నుంచి హైదరాబాద్

రాంచీ నుంచి హైదరాబాద్

వారణాసి నుంచి హైదరాబాద్

ముంబై నుంచి వైజాగ్

పోర్ట్‌బ్లెయిర్ నుంచి వైజాగ్

సెక్టార్‌ ఈ - కనిష్ఠ ఛార్జీ రూ.4,500, గరిష్ఠ ఛార్జీ 13 వేలు

అమృత్‌సర్ నుంచి హైదరాబాద్

హైదరాబాద్ నుంచి చండీఘఢ్, డెహ్రడూన్, గువహటి, వారణాసి

పోర్ట్ బ్లెయిర్ నుంచి హైదరాబాద్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)