సిత్రాలు సూడరో: మ‌ట్టి పాత్రలో జొన్న అన్నం.. ప‌చ్చిమిర‌ప‌కాయ ప‌చ్చ‌డి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వరుస బహిరంగ సభలు, రోడ్ షోలతో నేతలు విరామం లేకుండా గడుపుతున్నారు. ఒక్కో నేత ఒక్కో విధంగా తమదైన రీతిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చిన్న పిల్లలను ఎత్తుకుని లాలిస్తూ కొందరు, చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఫొటోలు దిగుతున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు.

ప్రచార హోరులో భాగంగా వివిధ పార్టీల నేతలు తమ సోషల్ మీడియా వేదికల మీద షేర్ చేసిన ఆసక్తికర చిత్రాలు కొన్ని చూద్దాం.

కృష్ణా జిల్లా ప్ర‌చారంలో భాగంగా మ‌చిలీప‌ట్నం స‌మీపంలోని మంగిన‌పూడి లైట్‌హౌస్ వ‌ద్ద జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాసేపు సేద‌తీరారు.

వేపచెట్టు కింద కూర్చుని మ‌ట్టిగిన్నెలో జొన్నఅన్నం మ‌జ్జిగ‌లో క‌లుపుకొని ప‌చ్చిమిర‌ప‌కాయ ప‌చ్చ‌డితో నంజుకొని తిన్నారు.

"గుంటూరు జిల్లాలోని రేవేంద్రపాడులో ప్రచారం చేస్తుండగా 80 ఏళ్ల మౌలాలీ, తన 2 వేల రూపాయిల పింఛను డబ్బును నాకు ప్రచార ఖర్చుల కోసం ఇచ్చారు. నేను గెలిస్తే మంగళగిరి రూపురేఖలు మారతాయన్న నమ్మకంతోనే ఇస్తున్నానని ఆయన అన్నారు. నేను గెలుస్తాను. మౌలాలిగారి నమ్మకాన్ని వంద శాతం నిలబెడతాను" అంటూ నారా లోకేశ్ ఈ కింది ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)