అణు యుద్ధం వస్తుందని భయపడ్డాడు.. 40 ఏళ్లు కష్టపడి నగరం నిర్మించాడు

వీడియో క్యాప్షన్, అణు విధ్వంసం నుంచి మానవజాతిని కాపాడేందుకు తయారైన మరో ప్రపంచం

కెనడాలోని ఒక గ్రామంలో విశ్రాంత పరిశోధకుడు బ్రూస్ బీచ్ అణుయుద్ధం నుంచి కాపాడుకోవడం కోసం భూగర్భంలో ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించారు. దీనికోసం ఆయన దాదాపు 40 సంవత్సరాల పాటు కృషి చేశారు.

అణుయుద్ధం మొదలైతే తోటి ప్రజలను రక్షించాలనే ఆలోచనతో భూగర్భంలో మిరుమిట్లుగొలిపే బంకర్లను ఆయన నిర్మించారు. భవిష్యత్తులో అణు యుద్ధం జరిగినా, వేలాది మంది ప్రజలు... ముఖ్యంగా పిల్లలు ఈ భూగర్భ నగరంలో సురక్షితంగా ఉండొచ్చు అని ఆయన చెబుతున్నారు. ఈ నగరానికి ‘ఆర్క్ టూ’ అని పేరు పెట్టారు.

విధ్వంసంలోంచి మానవ నాగరికత ఇక్కడ మళ్లీ పురుడు పోసుకుంటుంది అని చెబుతున్నారు బ్రూస్ బీచ్. ఆ నగరం ఎలా ఉందో మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)