ఈ మ్యాచ్లో పింక్ జెర్సీ ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
ఏంటీ మొన్నటిదాకా ఆకుపచ్చ రంగు జెర్సీలు వేసుకున్న సౌతాఫ్రికా క్రికెటర్లు ఈ రోజు పింక్ జెర్సీ వేసుకున్నారే అని చూస్తున్నారా.. దానికీ ఒక కారణముంది.
రొమ్ము కేన్సర్పై అవగాహన పెంచేందుకు వారు ఇలా చేశారు.
రొమ్ములకు సంబంధించి అసాధారణ మార్పులు కనిపిస్తే మహిళలు వైద్యులను సంప్రదించాలి.
ఆ మార్పుల వివరాలను మీరు కింది వీడియోలో చూసి తెలుసుకోవచ్చు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి
- భారత్లో రొమ్ము కేన్సర్ బారిన పడే మహిళల శాతం ఎక్కువ.
- లక్ష మంది మహిళల్లో 33 మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నట్లు ఐసీఎంఆర్ అంచనా.
- దేశంలో ఏటా లక్ష మందికిపైగా రొమ్ము కేన్సర్ బారినపడుతున్నారు.
- 2020కి దేశంలో రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య 1797900 కి చేరవచ్చని జాతీయ బయో టెక్నాలజీ సమాచార కేంద్రం అంచనా.
- జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అవగాహనా లోపాలను రొమ్ము కేన్సర్ కి కారణాలని తెలిపింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





