You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రణబ్ ముఖర్జీ: ‘నేను బాల్ థాకరేను కలవటం సోనియా గాంధీకి నచ్చలేదు’
శివసేన అధినేత బాల్ థాకరేను తాను కలవడం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నచ్చలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు.
2012 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్సీపీ నేత శరద్ పవార్ సూచనతో తాను థాకరేను కలిసానని ప్రణబ్ తన ‘‘ది కోఅలిషన్ ఇయర్స్’ పుస్తకంలో గుర్తు చేశారు.
"అప్పుడు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బాల్ థాకరే, ఆ కూటమి అభ్యర్థిని కాదని నాకు మద్దతు ఇచ్చారు. ఆయన్ను కలవాలా? వద్దా? అని సోనియా గాంధీ, శరద్ పవార్ ఇద్దరినీ అడిగా. సోనియా వద్దన్నారు. పవార్ మాత్రం తప్పకుండా కలవాలని సూచించారు. చివరికి సోనియా నిర్ణయాన్ని కాదని, 2012 జూలై 13న బాల్ థాకరేను కలిసేందుకు ముంబయి వెళ్లాను. అందుకు సోనియా గాంధీ నొచ్చుకున్నారు’’ అని ప్రణబ్ గుర్తు చేశారు.
"మరుసటి రోజు ఉదయాన్నే దిల్లీలో గిరిజా వ్యాస్ నన్ను పిలిచారు. నేను థాకరేను కలవడం సోనియాకు, అహ్మద్ పటేల్కు నచ్చలేదని ఆమె అన్నారు. ఆయన్ను కలవడంలో తప్పులేదని భావించి అలా చేశానని గిరిజాకు వివరించా. ఆ విషయాన్ని అక్కడితే వదిలేయాలని నిర్ణయించుకున్నా. మళ్లీ సోనియా, అహ్మద్ పటేల్ ముందుకు ఆ విషయాన్ని తీసుకెళ్లలేదు’’ అని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఆ ఎన్నికల్లో యూపీయే తరపున పోటీ చేసి.. భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నికయ్యారు. 2012 నుంచి 2017 జూలై వరకు పదవిలో కొనసాగారు.
ఇవి కూడా చదవండి:
- 'సోనియా హిందువులను ద్వేషిస్తారు'.. ప్రణబ్ ముఖర్జీ అలానే రాశారా
- ప్రణబ్ ముఖర్జీకి బీజేపీ ప్రభుత్వం భారతరత్న ఎందుకిచ్చింది...
- ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ఎందుకు హాజరవుతున్నారు?
- గోవిందాచార్య వ్యాసం: ప్రణబ్ రాకకు, ఆరెస్సెస్ ఆహ్వానానికి అర్థమిదే
- తెలంగాణ మూలాలున్న హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ఇలా స్థాపించారు
- ముస్లింలను బాల్ ఠాక్రే ప్రేమించారా? ద్వేషించారా?
- దక్షిణ భారతీయులంటే బాల్ థాకరేకు ఎందుకు నచ్చదు?
- శివసేనలో మహిళలకు చోటు లేదా?
- గ్రేట్ వాల్ ఆఫ్ చైనా: ప్రకృతి దాడిని తట్టుకోగలదా
- మహారాష్ట్రలో ‘పెద్దన్న’ ఎవరు? శివసేన కోరికను బీజేపీ అంగీకరిస్తుందా?
- అమెరికాలో తాజా నత్తల వ్యాపారం: గ్రీన్హౌస్ ఫామ్ల్లో నత్తల్ని సాగుచేసి రెస్టారెంట్లకు అమ్ముతున్న హెలీకల్చరలిస్ట్
- ప్రణబ్ ముఖర్జీ: ఆర్ఎస్ఎస్ వేదికపై ‘నెహ్రూ స్వరం’
- విరాట్ కోహ్లీ: ‘ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేక కుమిలిపోయా.. క్రికెట్ను వదిలేయాలన్న ఆలోచనలూ వచ్చాయి’
- నైలు నదిపై నీటి యుద్ధం.. భారీ ఆనకట్ట రేపిన వివాదం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)