You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'మీకు వద్దనుకుంటే, కొనకండి', అమెరికా ఆరోపణలకు జైశంకర్ స్పందన..
రష్యా నుంచి చమురు కొని భారత్ లాభాలు ఆర్జిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సమాధానం ఇచ్చారు. ఎకనామిక్ టైమ్స్ 'వరల్డ్ లీడర్స్ ఫోరం 2025'లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు జైశంకర్ స్పందించారు.
''చూడండి, వాణిజ్యానికి మద్దతిచ్చే అమెరికా ప్రభుత్వం కోసం పనిచేసేవారు.. వాణిజ్యం చేస్తున్నారని ఇతరులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. ఆశ్చర్యకరం.
కానీ, మీకు భారత్ నుంచి ఆయిల్ లేదా రిఫైన్డ్ ఉత్పత్తులు కొనడంలో ఏదైనా సమస్య ఉంటే, వాటిని కొనకండి. మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడంలేదు.
కానీ, మీరు కొంటారు. అమెరికా కొనుగోలు చేస్తుంది. మీకు నచ్చకపోతే వాటిని కొనకండి'' అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)