You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆకలి బాధతో కన్న కూతుళ్ళను అమ్ముకుంటున్నారు
అఫ్గానిస్తాన్ తాలిబాన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత ఇది రెండవ చలి కాలం. అఫ్గాన్ ప్రజలకు ఈ చలిని తట్టుకుని మనుగడ సాగించడమే పెను భారంగా మారింది.
బతికుండేందుకు తమ కూతుళ్లను కూడా అమ్ముకుంటున్నారు. అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రస్తుత పరిస్థితులను ఐక్యరాజ్య సమితి పెను విపత్తుగా చెబుతోంది. లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
పోషకాహార లోపంతో బాధపడే పిల్లల సంఖ్య దాదాపుగా 50 శాతానికి పెరిగింది. ఆకలితో ఉన్న తమ పిల్లలను నిద్రపుచ్చేందుకు మత్తు బిళ్లలను వేస్తున్నట్లు కొంతమంది తల్లిదండ్రులు బీబీసీతో చెప్పారు.
బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయే అందిస్తోన్న ఈ కథనంలో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచి వేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులోళ్ల దగ్గరకు ఎలా వెళ్లాయి’
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- కాంతారా: అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- విప్ప సారా: బ్రిటిషర్లు నిషేధించిన ఈ భారతీయ మద్యం అంతర్జాతీయంగా ఆదరణ పొందగలదా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)