‘బతికున్నవారి కంటే శవాలే నయం’.. మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసే మహిళ

‘‘శవాలేం చేస్తాయ్.. బతికున్నవాళ్లను చూసే భయపడాలి కానీ..’’.. పోస్టుమార్టం గదిలో శవాలను కోసే వరాలు అనే యువతి చెబుతున్న మాటలు ఇవి. శవాన్ని చూడాలంటేనే చాలా మంది భయపడతారు. కానీ ఎం.కామ్ చదివిన వరాలు ఏడాదిన్నరగా ఈ పని చేస్తున్నారు.

శవపరీక్ష కోసం మృతదేహాలను కోసే పనిలో ఎక్కువగా మగవాళ్లే ఉంటారు. ఆడవాళ్లు ఉండటమనేది చాలా అరుదు. మరి ఇలాంటి వృత్తిలోకి వరాలు ఎలా వచ్చారు? ఆమె కథ ఏంటి? ప్రస్తుతం గర్భిణిగా ఉన్న వరాలు, మెటర్నిటీ లీవులో ఉన్నారు. ఇంటి దగ్గర బీబీసీ పలకరించినప్పుడు ఆమె కథను చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)