You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పారిస్ ఒలింపిక్స్: అట్టహాసంగా ఆరంభ వేడుకలు, భారత బృందానికి సారథ్యం వహించిన పీవీ సింధు, శరత్ కమల్...
పారిస్లో ఒలింపిక్స్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్టేడియంలో కాకుండా తొలిసారి ఒక నది పక్కన జరిగిన ఈ వేడుకల్లో భారత క్రీడా బృందానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్లు సారథ్యం వహించారు.
జాతీయ జెండాతో పీవీ సింధు బోటులో నిల్చుని కనిపించింది.
భారతీయ ఆటగాళ్లందరూ చేతుల్లో జాతీయ పతకాన్ని పట్టుకుని కనిపించారు.
ఈ ఏడాది జరుగుతున్న ఒలింపిక్స్ కోసం భారత్ 117 మంది ఆటగాళ్లను పారిస్కు పంపించింది.
మొట్టమొదటిసారి ఈ వేడుకలు ఒక స్టేడియంలో కాకుండా, నగరం మధ్యలో ఉన్న సెన్ నదీ తీరంలో జరిగాయి. ఒలింపిక్స్ కోసం పారిస్కు తరలివెళ్లిన ఆటగాళ్లంతా సెన్ నదిలో బోట్లలో విహరించారు.
భారత ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పారిస్ ఒలింపిక్స్ వేడుకల దృశ్యాలు
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)