You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణలో మొంథా తుపాను తీవ్రత చెప్పే 9 ఫొటోలు
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
మొంథా తుపాను కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ముంచెత్తడంతో చాలా ప్రాంతాల్లో రహదారులు మునిగిపోయాయి, రాకపోకలు నిలిచిపోయాయి.
బుధవారం తెలంగాణలోనే అత్యధికంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 42 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
చుట్టుపక్కల చెరువుల నుంచి భారీగా వరద నీరు రావడంతో వరంగల్ నగరంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఎస్టీఆర్ఎఫ్, స్థానిక మునిసిపాలిటీ, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
వరంగల్లోని అండర్ బ్రిడ్జి సమీపంలో వరద నీరు పోటెత్తడంతో ఉత్తర తెలంగాణ నుంచి నగరంలోకి వచ్చే వాహనాలు వందల సంఖ్యల చిక్కుకుపోయాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)