బీబీసీ ఇన్నోవేటర్స్: గ్రామాల్లో మరుగుదొడ్ల సమస్యకు సరికొత్త పరిష్కారం
దేశంలో ఇప్పటికీ యాభై కోట్ల మంది ప్రజలు మరుగుదొడ్లకు దూరంగా ఉన్నారు. అలాంటి వాళ్ల సమస్యకు కొత్త దారిలో పరిష్కారం చూపుతున్నారు ముగ్గురు సోషల్ ఆంట్రప్రెన్యూర్లు.
చందన్, అనూప్, ప్రవీణ్.. ఈ ముగ్గురూ గ్రామాల్లో మరుగు దొడ్లను నిర్మించడంతో పాటు, ఆ మురుగు నుంచే విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఆ విద్యుత్ సాయంతో భూగర్భ జలాన్ని మంచినీరుగా మారుస్తున్నారు.
అలా శుద్ధి చేసిన నీటిని లీటర్కి అర్ధ రూపాయి చొప్పున అమ్ముతూ, ఆ ఆదాయాన్ని మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నారు. పాత సమస్యకు కొత్త దారిలో పరిష్కారం చూపుతున్న ఈ ముగ్గురూ ‘బీబీసీ ఇన్నొవేటర్స్’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.


దక్షిణాసియాలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలకు సరికొత్త పరిష్కార మార్గాలను 'బీబీసీ ఇన్నోవేటర్స్' సిరీస్ వెలుగులోకి తెస్తుంది.
సమస్యలకు పరిష్కారాలు చూపే గొప్ప ఆవిష్కరణలు మీకు ఎక్కడ కనిపించినా, మీరే అలాంటి పరిష్కారాలు కనుగొన్నా ఆ ఫొటోలను మాతో పంచుకోండి.
[email protected] కి ఈమెయిల్ చేయొచ్చు. #Jugaad, #BBCInnovators హ్యాష్ట్యాగ్లతో @BBCWorldService కి షేర్ చేయండి. లేదా ఈ లింక్ను క్లిక్ చేసి అప్లోడ్ చేయొచ్చు..

(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)