You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యెమెన్: ఆకలి, కలరా కోరల్లో లక్షలాది చిన్నారులు
దశాబ్ద కాలంగా సాగుతున్న యుద్ధం ఫలితంగా యెమెన్ తీవ్ర మానవీయ సంక్షోభంలో చిక్కుకుంది.
పది లక్షల మంది పిల్లలు కలరా మహమ్మారి బారిన పడ్డారు. మరెందరో ఆకలి కోరల్లో చిక్కుకున్నారు. ఇది రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ చెప్పిన నిష్ఠుర సత్యం.
యెమెన్ లో ఎనభై శాతం జనాభాకు సరైన తిండి లేదు. తాగేందుకు మంచినీళ్ళు లేవు. యెమెన్ రాజధాని సనా నుంచి బీబీసీ ప్రతినిధి నవాల్-అల్-మఘాఫీ అందిస్తున్న రిపోర్ట్.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)