ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకూ మూడుసార్లు పెళ్లి చేస్తారు.. ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న మాలీస్ గిరిజన తెగలో ఇదొక ఆచారం. ఈ తెగలో పుట్టే ఆడపిల్లలకు మూడుసార్లు పెళ్లి చేస్తారు.
పుట్టిన ఐదేళ్లలోపు ఒకసారి, యుక్తవయసు రాగానే మరోసారి పెళ్లి చేస్తారు. ఈ రెండు పెళ్లిళ్లలో వరుడు ఉండడు. అయినా, వీటిని వివాహాలుగానే మాలీస్ గిరిజనులు పిలుస్తారు. మూడోసారి జరిగే పెళ్లిలో వరుడు ఉంటాడు.
ముందు జరిగే రెండు పెళ్లిళ్లు సామూహికంగా జరుగుతాయి. గ్రామంలో ఉన్న ఆడ పిల్లలందరికి ఒకేసారి ఈ వివాహాలు చేస్తారు. వరుడు ఉండడనే మాటే కానీ, గ్రామం మొత్తానికి పెళ్లి జరుగుతుందా అనేంత సందడిగా ఈ వివాహాలు చేస్తారు.
ఇవి కూడా చదవండి:
- భార్యతో బలవంతంగా సెక్స్లో పాల్గొనొచ్చా? నేపాల్, బ్రిటన్ నుంచి భారత్ నేర్చుకోవాల్సింది ఏమిటి?
- తెలంగాణ: పెళ్లైన నెల రోజులకే భర్త పీక పిసికి, పైట బిగించి హత్య చేసిన భార్య.. ఏం జరిగిందంటే..
- 'ముస్లింలలో బహుభార్యత్వం అరుదు, అదొక సమస్య కాదు'.. 'అలాగైతే, రద్దు చేయొచ్చుగా, ఏం నష్టం?'
- ఆంధ్రప్రదేశ్: టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. ఏ కేసులో అరెస్ట్ చేశారు? తెరవెనుక ఏం జరిగింది?
- యుక్రెయిన్-రష్యా యుద్ధంతో ఈ దేశం సంపద ఎందుకు పెరుగుతోంది?
- ఎండలు పెరగడంతో మండిపోతున్న గోదుమ పిండి ధర
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)