ఆదివాసీల నాగోబా జాతర ఎన్నో ప్రత్యేకతలు, ఏమిటో తెలుసా

వీడియో క్యాప్షన్, ఆదివాసీల నాగోబా జాతర ప్రత్యేకతలేమిటో తెలుసా

గోండ్వానా ప్రాంతానికి చెందిన ఆదివాసీల ఆచార సంప్రదాయాల వేడుక నాగోబా జాతర.

పుష్యమాసాన్ని జాతరల నెలగా భావించే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు నాగోబా జాతరను జరుపుకుంటారు.

నాగోబా విగ్రహానికి అభిషేకంతో ఈ జాతర వేడుకలు ప్రారంభమవుతాయి. అభిషేక జలాల కోసం ఆదివాసీలు కొండకోనలు దాటి కాలినడకన గోదావరి నదిలో ఉన్న హస్తన మడుగుకు చేరుకుంటారు.

ఈ యాత్రలో సంప్రదాయం ప్రకారం ఎన్నో ఆచారాలు పాటిస్తారు.

జాతరను తమ సంస్కృతి పరిరక్షణ, సంబంధ బాంధవ్యాలను కలుపుకునే సంగమంగా ఆదివాసీలు నాగోబా జాతరను భావిస్తుంటారు.

జాతర భారీ కొనుగోళ్లతో సందడిగా సాగుతుంది. మహా పూజతో మొదలయ్యే ఈ జాతర, చివరి రోజు భేతాళ పూజతో ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)