అసదుద్దీన్ ఒవైసీ: ‘నాపై 4 రౌండ్లు ఫైరింగ్ జరిగింది.. నా కారు పంక్చర్ అయ్యింది’
ఉత్తర్ప్రదేశ్లోని మీరట్ నుంచి దిల్లీకి వెళుతున్న దారిలో ఒక టోల్ ప్లాజా వద్ద తన కారుపై కాల్పులు జరిపారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
"కొద్దిసేపటి క్రితం ఛజర్సీ టోల్ గేట్ వద్ద నా కారుపై కాల్పులు జరిపారు. 4 రౌండ్లు ఫైరింగ్ జరిగింది.
ముగ్గురు, నలుగురు ఉన్నారు. ఆయుధాలు అక్కడే వదిలేసి అందరూ పారిపోయారు. నా కారు పంక్చర్ అయింది.
వేరే కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాను. మేమంతా క్షేమంగా ఉన్నాం" అంటూ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఈ-పాస్పోర్ట్ అంటే ఏంటి, అది ఎలా పని చేస్తుంది? 10 సందేహాలకు జవాబులు
- గల్వాన్ డీకోడెడ్: 'గల్వాన్ లోయలో జరిగిన భారీ నష్టాన్ని చైనా దాచిపెడుతోంది'.. క్లాక్సన్ నివేదిక వెల్లడి
- 'సీఎం సార్.. హెల్ప్ మీ': తమిళనాడు ముఖ్యమంత్రికి తూర్పు గోదావరి విద్యార్థి వేడుకోలు
- హీరోయిన్ పుట్టుమచ్చలపై హీరోను ప్రశ్నించిన జర్నలిస్ట్, ‘ఇదీ మన జర్నలిజం’ అంటూ నెటిజన్ల ఆగ్రహం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)