మీ ఖాతాలో డబ్బులు పోతే బ్యాంకులు ఇస్తాయా
మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్... రూ. 12 కోట్లకు పైగా మాయం. ఇది, గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఘటనపై తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు. మహేష్ బ్యాంకు హ్యాకింగ్ జరగడానికి బ్యాంకు సర్వర్ లోపమే కారణమని స్పష్టం చేశారు.
హ్యాకింగ్ ద్వారా రూ. 12 .9 కోట్లు పలు ఖాతాలకు బదిలీ అయ్యాయని, అందులో 3 కోట్ల రూపాయలు ఎవరి చేతులు మారకుండా ఆపగలిగామని ఆయన చెప్పారు. ప్రజల ఖాతాలతో వ్యవస్థ నడిపినప్పుడు సరైన భద్రత కల్పించడం బ్యాంకుల కనీస బాధ్యత అని ఆనంద్ అన్నారు .
అయితే బ్యాంకులో మన డబ్బు సురక్షితమేనా అన్న ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగానో లేక మరేదో కారణంగా సైబర్ దోపిడీకి గురైనప్పుడు కస్టమర్ల డబ్బులు, వారి వ్యక్తిగత సమాచారం సురక్షితమేనా? ఒకవేళ హ్యాక్ అయితే ఖాతాదారుల డబ్బు ఎవరు చెల్లిస్తారు?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)