You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కశ్మీర్: కుల్గావ్లో మరో ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపిన మిలిటెంట్లు
జమ్ముకశ్మీర్లోని కుల్గావ్ జిల్లాలోని వాన్పో ప్రాంతంలో ఉగ్రవాదులు స్థానికేతర కార్మికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఆదివారం జరిగిన ఈ కాల్పులలో ఇద్దరు వలస కూలీలు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారని కశ్మీర్ పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని మిలిటెంట్ల కోసం వెతుకుతున్నాయి.
మిలిటెంట్ల కాల్పులలో మరణించిన కార్మికులు ఇద్దరూ బిహార్కు చెందినవారు.
శనివారం కూడా మిలిటెంట్లు శ్రీనగర్, పుల్వామాలలో ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపేశారు.
శ్రీనగర్లో మరణించిన వ్యక్తి బిహార్కు చెందిన అరవింద్ కుమార్గా పోలీసులు గుర్తించారు.
పుల్వామాలో మరణించిన సాగిర్ అహ్మద్ది ఉత్తరప్రదేశ్. కార్పెంటర్ పనిచేసుకుంటూ జీవిస్తున్న ఆయన మిలిటెంట్ల తుపాకులకు బలయ్యారు.
మరోవైపు వరుస దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్లను ఏరివేసేందుకు కశ్మీర్ పోలీసులు, భద్రతాదళాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నాయి.
గత వారం రోజులలో మొత్తం 13 మంది మిలిటెంట్లను హతమార్చారు.
ఇవి కూడా చదవండి:
- సోషల్ మీడియా ఆల్గారిథంలు అణుబాంబుల్లాంటివా, పేలకుండా ఆపేదెలా?
- నరేంద్ర గిరి: అఖాడా అధిపతి ఆత్మహత్య కేసులో అంతుచిక్కని ఐదు అంశాలు
- అమెరికాలో మోదీ: చైనాను ఎదుర్కొనేందుకు క్వాడ్ సదస్సు భారత్కు సాయం చేస్తుందా
- ‘చైనా ఫోన్లు కొనకండి, మీ దగ్గరున్నవి వీలైనంత త్వరగా పడేయండి’
- ‘ప్రపంచంలో కరోనావైరస్ చేరని దేశం మాదే’ అంటున్న తుర్క్మెనిస్తాన్, నిజమెంత?
- కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, పొందడం ఎలా?
- విశాఖలో కుక్కల పార్కుపై వివాదమేంటి? వద్దంటున్నదెవరు, కావాలనేదెవరు
- 'కన్యాదానం' అమ్మాయిలకే ఎందుకు? భారతీయ సంప్రదాయాలను సవాలు చేస్తున్న ప్రకటనలు
- భారత్లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లకు ఇప్పుడు ఐఎస్ శత్రువుగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)