తాగు నీరు దొరక్క ఏటా 2 లక్షల మంది మృతి

వీడియో క్యాప్షన్, తాగు నీరు దొరక్క ఏటా 2 లక్షల మంది మృతి

భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది.

వేసవి వచ్చిందంటే చాలు వేలాది గ్రామాల గొంతెండిపోతుంది.

తాగునీటి కోసం పదుల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి.

కొన్ని ప్రాంతాల్లో నీరున్నా అది తాగేందుకు అనువైనది కాకపోవడం వల్ల రోగాల బారినపడుతున్నారు.

ప్రభుత్వాల రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థలు ప్రజల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నాయి.

దేశంలో 42 శాతం ప్రాంతంలో కరవు

భూతాపం కారణంగా భారత్‌లో మంచి నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

వాతావరణ మార్పులతో 2019 ఏప్రిల్ నాటికి భారత దేశంలో 42 శాతం ప్రాంతం కరవుతో అల్లాడుతోంది.

అంతే కాదు.. మంచి నీరు లేక ఏటా భారత్‌లో 2లక్షల మంది మృతి చెందుతున్నారు.

భారత్‌లో తాగునీటి కొరతపై రూపొందించిన ఈ వీడియో చూడండి.

ప్రొడ్యూసర్: వంశీ చైతన్య

ఇలస్ట్రేషన్: గోపాల్ శూన్య

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)