వీడియో: పంజాబ్‌‌లో డ్రగ్స్ సమస్య ఇప్పుడు ఎలా ఉంది?

వీడియో క్యాప్షన్, పంజాబ్‌: డ్రగ్స్ సమస్య ఇప్పుడు ఎలా ఉంది?

కొన్నేళ్లుగా పంజాబ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల సమస్య పట్టి పీడిస్తోంది. అధికారంలోకొచ్చే ప్రతి పార్టీ కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉంటున్నాయి. ఎన్నికలొచ్చే ప్రతి సారీ ఎక్కువగా వార్తల్లోకొచ్చేది ఈ మాదక ద్రవ్యాల అంశమే.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరే ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ డ్రగ్స్ అంశం వార్తల్లో నిలిచింది. డ్రగ్స్ సమస్య ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

పంజాబ్‌లో లూధియానా జిల్లాలోని బేట్ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా మత్తుపదార్థాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ మత్తు పదార్ధాలను అమ్మేవాళ్లకు, కొనే వాళ్ళకు ఎప్పుడూ కొరత ఉండదని చెబుతుంటారు స్థానికులు.

గతంతో పోలిస్తే ఇప్పుడు మాదక ద్రవ్యాలను కొనడం కాస్త కష్టంగా మారినప్పటికీ అవి ఇంకా అందుబాటులోనే ఉన్నాయని బీబీసీ పరిశోధనలో తేలింది. ఇప్పటికీ ప్రజలు వాటినమాదక ద్రవ్యాలను వాడుతూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)