మహారాష్ర్టలో మరాఠాలకు రిజర్వేషన్లు: బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

ఫొటో సోర్స్, Getty Images
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లు పాస్ చేసింది.
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
మహారాష్ట్ర స్టేట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ప్రతిపాదనలపై తీసుకున్న చర్యల నివేదిక( ఏటీఆర్)తోపాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
మరాఠాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన పౌరుల తరగతిగా(ఎస్ఈబీసీ)గా ప్యానల్ ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి తగినంత ప్రాతినిధ్యం లభించలేదని తమ నివేదికలో పేర్కొంది.
రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం రిజర్వేషన్ ప్రయోజనాలకు వారు అర్హులేనని తెలిపింది.
అసాధారణ పరిస్థితులను పరిశీలించిన తర్వాత మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని, రిజర్వేషన్ ప్రయోజనాలకు వారు అర్హులేనని తాము ప్రకటించినట్లు ప్యానల్ ఇందులో సూచించింది.
రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దడానికి రాజ్యాంగ నిబంధనలకు లోబడి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.
విద్యాసంస్థల్లో ప్రవేశానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని తర్వాత బిల్లును ప్రవేశపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
బిల్లులో ప్రధాన అంశాలు
- ఈ బిల్లు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన పౌరులుగా ప్రకటించిన మరాఠాలకు విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు రిజర్వేషన్లు కల్పిస్తుంది.
- ఈ బిల్లు ప్రకారం మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు.
- రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లు వర్తించవు.
- రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓబీసీ బిల్లుతోపాటు ఈ రిజర్వేషన్ బిల్లు కూడా ఉంటుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 68 శాతానికి చేరాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్లు కావాలంటూ మరాఠా సమాజం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది.
ఈ ఏడాది జులై, ఆగస్టులో రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
బిల్లును సభలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించేలా సహకరించిన విపక్షానికి ధన్యవాదాలు తెలిపారు.
2014లో కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం మరాఠా సమాజానికి 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ రిజర్వేషన్లను న్యాయస్థానం రద్దు చేసింది.
ఇవి కూడా చదవండి
- మధ్యప్రదేశ్ ఎన్నికలు: రాబోయే పార్లమెంటు ఎన్నికలకు దిక్సూచి అవుతాయా
- ‘నేను నిర్మించింది హైదరాబాద్ కాదు.. సైబరాబాద్’
- గ్రేట్ వాల్ ఆఫ్ చైనా: ప్రకృతి దాడిని తట్టుకోగలదా
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- భారతదేశం ఇస్లామిక్ పేర్ల మీద యుద్ధం ప్రకటించిందా?
- ఎంపీలుగా ఓడారు.. ఎమ్మెల్యే టికెట్ పట్టారు
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








