అమరావతి ఫార్ములా వన్ రేసింగ్: విజేత అబుదాబి జట్టు

    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణానదిలో ఫార్ములా వన్ బోట్ రేసింగ్ పోటీలు ముగిశాయి.

ఈ ఫార్ములా వన్ హెచ్2ఓ రేస్‌లో అబుదాబి రేసర్ షాన్ టెరెంటో విజేతగా నిలిచారు.

రెండో స్థానంలో స్ట్రోమెయి ఎరిక్, మూడో స్థానంలో ఎరిక్ స్టార్క్ నిలిచారు.

అమరావతి జట్టు తరఫున పోటీలో నిలిచిన స్వీడన్‌కు చెందిన రేసర్ జోనస్ ఆండర్సన్ చివరివరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 33వ రౌండ్‌లో ఆయన బోటు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో ఆయన పోరాటం ముగిసింది.

రెండో రోజు పోటీల‌ు ప్రిలిమిన‌రీ రౌండ్లతో ప్రారంభం కాగా అమ‌రావ‌తి టీమ్ దూకుడుచూపింది.

క్వాలిఫైడ్ రౌండ్ల‌లో తొలి పోటీలో అమ‌రావ‌తి టీం రేసర్ జోనస్ ఆండ‌ర్స‌న్ మొద‌టి స్థానంలో నిలిచారు.

రెండో పోటీలో జోనస్ ఆండ‌ర్సన్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నారు.

తుది పోటీల్లో సాంకేతిక కారణాలతో బోటు నిలిచిపోవడంతో రేస్ పూర్తి చేయలేకపోయారు.

రేస్‌లో మొత్తం 19 బోట్‌లు పాలుపంచుకున్నాయి. అమరావతి టీంకు చెందిన జోనస్ ఆండర్సన్, ఎడిన్ ఎరిక్‌లు 5, 19వ స్థానాల్లో నిలిచారు.

అబుదాబిలో జరిగే ఫైనల్‌లో విజయం సాధించడమే తన లక్ష్యమని అమరావతి ఫార్ములా వన్ రేసింగ్ విజేత షాన్ టెరొంటో అన్నారు. ఈ ఏడాది జరిగిన రేస్‌లలో మూడుసార్లు షాన్ మొదటి స్థానంలో నిలిచారు.

కాగా, తొలి మూడు స్థానాల్లో రెండు అబుదాబి రేసర్లకు దక్కాయి. నార్వేకి చెందిన మహిళా రేసర్ స్ట్రోమెయి ఎరిక్ రెండో స్థానంలో నిలిచి అందరినీ ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)