You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరుణానిధికి అంత్యక్రియలు మెరీనాలోనే
కరుణానిధి మృతదేహాన్ని మెరీనా బీచ్లో ఖననం చేయాలని డీఎంకే డిమాండ్ చేయగా.. ప్రభుత్వం దానికి నిరాకరించింది. మద్రాసు హైకోర్టు ఈ వివాదానికి తెరదించుతూ మెరీనాలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతించింది.
కోర్టులో ప్రభుత్వం మెరీనా బీచ్లో ఖననానికి సంబంధించి వివాదం ఉందని తెలిపింది.
చెన్నైలోని గిండీలో కరుణ సమాధికి చోటు ఇస్తామని తెలిపింది. దీంతో అంశం చివరకు మద్రాసు హైకోర్టు వరకు వెళ్లింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తరహాలోనే డీఎంకే అధినేత కరుణానిధిని ఖననం చేయనున్నారు.
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి (94) చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు.
జయలలిత మృతి సమయంలో ఆమెను దహనం చేయకుండా ఖననం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న తలెత్తింది.
ఆ సమయంలో మద్రాసు యూనివర్సిటీకి చెందిన తమిళ ప్రొఫెసర్ డాక్టర్ వి.అరుసు బీబీసీతో మాట్లాడుతూ, ద్రవిడ ఉద్యమంలో పాల్గొన్నందువల్లే జయలలితను దహనం చేయకుండా ఖననం చేశారని తెలిపారు.
''హిందూ సంప్రదాయాలు , బ్రాహ్మణ పద్ధతులను ద్రవిడ ఉద్యమకారులు నమ్మరు. జయలలిత, కరుణానిధి ఆ ఉద్యమంలో పాల్గొన్నవారు కాబట్టి వారిని దహనం చేయడం లేదు'' అని చెప్పారు.
బ్రాహ్మణ వ్యతిరేకత
జయలలిత కూడా ద్రవిడ పార్టీ నాయకురాలే. కరుణనిధి కూడా ఎప్పటి నుంచో ద్రవిడ ఉద్యమంలో భాగస్వామ్యులై ఉన్నారు. అందుకే జయలలిత మాదిరిగా ఆయన మృతదేహాన్ని కూడా ఖననం చేయనున్నారు.
ద్రవిడ ఉద్యమకారులు హిందూ ఆచారాలు, పద్ధతులనే కాకుండా కులాన్ని సూచించే పేర్లను కూడా పెట్టుకోరని వి.అరుసు తెలిపారు.
జయలలిత కంటే ముందు ఎంజీ రామచంద్రన్ను కూడా ఖననం చేశారు.
డీఎంకే వ్యవస్థాపకుడు, ద్రవిడ ఉద్యమ నేత అన్నాదురై సమాధి సమీపంలోనే వీరిద్దరి సమాధులున్నాయి.
ఎంజీఆర్ మొదట్లో డీఎంకేలోనే ఉండేవారు. అన్నాదురై మృతి తర్వాత పార్టీ పగ్గాలను కరుణానిధి చేపట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఎంజీఆర్, కరుణల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో ఎంజీఆర్ ..డీఎంకే నుంచి విడిపోయి అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు.
ఇవికూడా చదవండి
- మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్కార్న్ రూ.270 ఎందుకిలా?
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
- చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’
- ఆమిర్ ఖాన్కు చైనాలో అంత ఫాలోయింగ్ ఎందుకు?
- మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే..
- సోనియా గాంధీ గౌను ఇందిర రక్తంతో తడిచిపోయింది..
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)