You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చెట్లు మనుషుల్ని చుట్టేసుకుంటాయా, ఏమిటి ఈ నమ్మకాలు?
పార్వతీపురం - మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని చెట్లు, కర్రలు తమని కరుస్తున్నాయని, పట్టుకుని చుట్టేస్తున్నాయంటూ వలగజ్జి గ్రామ గిరిజనులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అటవీశాఖ అధికారులు గత కొద్దిరోజులుగా వలగజ్జి గిరిజన గ్రామంలో ఏం జరుగుతుందనే దానిపై నిశిత పరిశీలన జరుపుతున్నారు.
అయితే, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నట్లుగా చెట్లు చుట్టేయడం, కర్రలు కరవడం వంటివి జరగవని ఇవన్నీ నమ్మకాలని నిపుణులు చెబుతున్నారు.
అనుకోకుండా జరిగే ఘటనలను నిజంగా భావించి కొందరు అపోహ పడుతుంటారని, ఇవన్నీ పూర్తిగా శాస్త్రీయత లేని నమ్మకాల నుంచి పుట్టుకొచ్చిన ఆందోళనలని వృక్షశాస్త్ర నిపుణులు, అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)