You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దసరాకు భారత్ రాబోతున్న బంగ్లాదేశ్ పులస
దసరా పండగ రోజుల్లో బెంగాలీలకు హిల్సా చేపలతో విందు అనేది దుర్గా పూజలో ముఖ్యమైన భాగం. ఈ హిల్సా చేపలనే తెలుగునాట పులస చేపగా పిలుస్తారు.
దసరా సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ పులస చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు.
భారత్కు తమ పులస ఎగుమతిపై నిషేధం బెంగాలీలలో కలకలం సృష్టించింది.
అయితే, ఈ నిషేధం కొద్ది రోజుల వ్యవధిలోనే ఎత్తివేయడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ పులసలతో బెంగాలీలు పండగ చేసుకోబోతున్నారు.
బంగ్లాదేశ్లో ఈ చేప ఎగుమతిపై ఎప్పటికప్పుడు ఆంక్షలు ఉంటున్నప్పటికీ, గతంలో ప్రభుత్వాలు దసరా సందర్భంగా నిషేధాన్ని ఎత్తివేసేవి. దీనిని బెంగాల్ ప్రజలకు గిఫ్ట్ అని చెప్పుకునేవారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)