ఇరాన్: హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తి మరణ శిక్ష

ఇరాన్: హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తి మరణ శిక్ష

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల మధ్య తెహ్రాన్ కోర్టు ఒకరికి మరణ శిక్ష విధించిన తీర్పుని వెల్లడించింది.

దాదాపు 500 మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు 5నుంచి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించారు.

రెండు నెలల క్రితం హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో 22 ఏళ్ల మాషా అమీనీ పైన దారుణంగా దాడి చేసి అరెస్టు చేశారు ఇరాన్ పోలీసులు.

తర్వాత ఆమె జైలులోనే గుండెపోటుతో కుప్పకూలి కోమాలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)