You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జో బైడెన్ 10 గంటల పాటు రహస్యంగా రైలులో ప్రయాణం.. ఇంత సీక్రెట్గా ఎలా ఉంచారు?
ఇది ఒక సంచలన పర్యటన. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఇలాంటి పర్యటన చేస్తారని దాదాపు ఎవరూ విని ఉండరు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అకస్మాత్తుగా యుక్రెయిన్ రాజధాని కీయెవ్లో ప్రత్యక్షమయ్యారు.
ఈ ఆకస్మిక పర్యటనను ‘‘ఆధునిక కాలంలో అపూర్వమైనది’’గా వైట్ హౌస్ అధికారులు వర్ణించారు.
కీయెవ్కు చేరుకోవడానికి బైడెన్ పది గంటల పాటు రైలులో రహస్యంగా ప్రయాణించారు.
ఈ సమయంలో యుక్రెయిన్లోని వేరే ప్రాంతాలకు విమానంలో అయితే ఆయన సులభంగా చేరి ఉండేవారు.
కానీ, కష్టమైనప్పటికీ కీయెవ్కు వెళ్లాలనే ఆయన నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనను ప్రతిష్టాత్మకం చేయాలని అనుకున్నారు.
బైడెన్, ఈ పర్యటన ద్వారా యుక్రెయిన్కు సహాయం చేస్తుంటామనే సంకేతాన్ని రష్యాకు పంపించారు.
ఇవి కూడా చదవండి:
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- ఉమన్ బాడీ బిల్డర్: కష్టాల కడలిలో ఈదుతూ కండలు తీర్చిదిద్దుకున్న మహిళ
- యుక్రెయిన్ యుద్ధం వల్ల తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరడం లేదు?
- నాగ సాధువులు ఔరంగజేబు సైన్యంతో పోరాడినప్పుడు ఏం జరిగింది?
- రవీంద్ర జడేజా: టెస్టు క్రికెట్లో సూపర్ ఆల్రౌండర్గా అవతరిస్తున్నాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)