You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్లో మిడతలు పట్టి అమ్ముకుంటున్న రైతులు
పాకిస్తాన్పై మిడతలు దాడి చేసి, తీవ్రంగా దాడి తీవ్రంగా దాడి చేస్తున్నాయి. అయితే, వాటిని సజీవంగా పట్టుకుంటే డబ్బులు ఇచ్చి కొంటామని దేశ ఆహార భద్రతా విభాగం ప్రకటించింది.
దాంతో, స్థానికులు టన్నుల మిడతలను పట్టుకుని, అధికారులకు అమ్మారు.
"నా భార్య, పిల్లలు మిడతలను పట్టుకున్నారు. తర్వాత వాటిని అధికారులకు అమ్మేశాం. కిలో మిడతలకు 20 రూపాయల చొప్పున ఇచ్చారు" అని అలీ షేర్ అనే స్థానిక రైతు చెప్పారు.
మిడత గుంపులు మూడు నెలల కింద ఒకారా జిల్లాపై దాడి చేశాయి. ఇంతకు ముందెప్పుడూ ఇక్కడి రైతులు మిడతల దాడిని చూడలేదు. "మిడతలు దాడి చేసినప్పుడు, మేము పొలాల్లో పని చేస్తున్నాం. ఏం జరిగిందో చూసేందుకు అందరూ వచ్చారు. డప్పులు, పాత్రలను కొట్టినా అవి కదల్లేదు. మిడతల వల్ల చాలా నష్టపోయాం. వీటిని సజీవంగా పట్టుకుని విక్రయించాలని అధికారులు కోరారు. దాంతో మేమంతా కలిసి వీటిని పట్టుకోవడం మొదలుపెట్టాం. అయినా చాలానే నష్టపోయాం" అని అలీ వివరించారు.
మేము పట్టుకున్న మిడతలన్నింటికీ కలిపి 5000 రూపాయలు వచ్చాయి. కానీ, మేం నష్టంపోయింది 2 లక్షల రూపాయలని ఆయన చెప్పారు.
ఈ మిడతల గుంపులు గంటకు దాదాపు 145 కిలోమీటర్ల వేగంతో ఎగురుతాయి. మరి వాటిని ఎలా పట్టుకోగలిగారు?"వాటిని పట్టుకునేందుకు చాలానే కష్టపడాల్సి వచ్చింది. మిడతలను పట్టేందుకు అడవిలోకి వెళ్తే, పాములు, ఇతర కీటకాలు కూడా ఉన్నాయి. దాంతో మేం భయపడ్డాం. అయినా, మిడతలను పట్టుకోగలిగాం. మాకు వేరే దారిలేదు. మిడతలు అప్పటికే మా పంటలను నాశనం చేశాయి కాబట్టి మేం ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాల్సి వచ్చింది" అని గుల్జార్ అనే మరో రైతు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: లాక్డౌన్ వారికి కొత్త కాదు... ఆ అందమైన దేశంలో అదొక చిరకాల సంప్రదాయం
- వందల ఏళ్ల క్రితమే క్వారంటైన్ విధానాన్ని అనుసరించిన పురాతన నగరం ఇది
- కోవిడ్-19: ‘నేను వెంటిలేటర్ తొలగించి రోగి మరణించడానికి సహాయపడతాను’
- లాక్డౌన్ 4.0.. స్టేడియంలను తెరవొచ్చు, ప్రేక్షకులు వెళ్ల కూడదు.. విమానాలు, మెట్రో రైళ్ల సేవలు రద్దు
- కరోనావైరస్: ఒంటరి వ్యక్తులు ‘సెక్స్ స్నేహితుల’ను వెదుక్కోండి – ప్రభుత్వ మార్గదర్శకాలు
- 800 మీటర్ల ఎత్తున్న శిఖరాల మీద నివసించే ప్రజలను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్న చైనా
- ప్రపంచం మెరుగవుతోంది... ఇవిగో రుజువులు
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)