ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
ఒక ఎన్నికల సభలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

ఫొటో సోర్స్, FB/KCR
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటలపాటు నిషేధం విధించింది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఈసీ ఈ చర్య తీసుకుంది. ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో జరిగిన ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ పైనా, ఆ పార్టీ నాయకులపైనా కేసీఆర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, UGC
దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కేసీఆర్ వివరణ కోరింది. అయితే ఆయన ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని ఎన్నికల సంఘం, ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించింది.
బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఆయన ఏ విధమైన ప్రచార కార్యక్రమాల్లో, మరే విధమైన ఎన్నికల కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదు. ప్రెస్మీట్లు పెట్టకూడదు.

ఫొటో సోర్స్, @CTRAVI_BJP
కర్ణాటకను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల వీడియోలపై హసన్ నియోజకవర్గ జనతాదళ్ (ఎస్) ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు.
ప్రజ్వల్ రేవణ్ణ పై లైంగిక వేధింపులు, వందలాది సెక్స్ వీడియోలు తీశారని, బాధితులను బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. అనేక వీడియోలు వైరల్గా మారిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్ళారనే విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ప్రజ్వల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘విచారణకు హాజరు కావడానికి ప్రస్తుతం నేను బెంగళూరులో లేను. నా న్యాయవాదుల ద్వారా బెంగళూరు సీఐడీతో టచ్లోనే ఉన్నాను. నిజమేమిటో త్వరలో తెలుస్తుంది’’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మంగళవారంనాడు ప్రత్యేక దర్యాప్తు బృందం జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణను తమ ముందు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ- జనసేన కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ పాల్గొన్నారు.
ఈ కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న కొన్ని హామీలు..
ఈ హామీలతో పాటు ఇంకా అనేక రకాల హామీలను ఈ కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ANI
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను చమురు మార్కెటింగ్ సంస్థలు తగ్గించాయి.
ఒక్కో సిలిండర్పై 19 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది.
ప్రస్తుతం దిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1745.50గా ఉందని వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
గత నెలలో కూడా 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.30.50 తగ్గించారు.
అంతర్జాతీయ చమురు ధరలను బట్టి వాణిజ్య, గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెలా ఒకటవ తేదీన సవరిస్తూ ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న కొలంబియా యూనివర్సిటీ ప్రాంగణంలోకి న్యూయార్క్ పోలీసులు ప్రవేశించారు. పాలస్తీనాకు మద్ధతుగా ఆందోళన చేస్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా, పాలస్తీనియన్లకు మద్దతు ఇస్తూ కొలంబియా యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు.
క్యాంపస్లో ఉన్న హామిల్టన్ హాల్ను నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఆక్రమించారు.
పరిస్థితి అదుపు తప్పడంతో, పోలీసులు హామిల్టన్ హాల్లోకి ప్రవేశించి విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారు.
క్యాంపస్లోకి పోలీసులు ప్రవేశించిన తర్వాత, తమ వద్ద మరో మార్గం లేదని యూనివర్సిటీ తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Reuters
యూనివర్సిటీ ప్రకటన
‘‘రాత్రి 9 గంటల తర్వాత న్యూయార్క్ పోలీసులు యూనివర్సిటీ అభ్యర్థన మేరకు క్యాంపస్లోకి ప్రవేశించారు. క్యాంపస్లో భద్రతను పునరుద్ధరించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం.
నిరసనకారులు వారి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తూ, ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లడంపై మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. హామిల్టన్ హాల్ను ఆక్రమించి, ధ్వంసం చేశారని మేం గుర్తించాం. అందుకే,మా వద్ద మరో మార్గం లేక, పోలీసులను పిలిపించాం.
కొలంబియా యూనివర్సిటీ భద్రతా సిబ్బందిని భవనం నుంచి బయటికి పంపించారు. మా టీమ్లోని ఒకర్ని బెదిరించారు. మా కమ్యూనిటీ భద్రతను మేం ప్రమాదంలో పెట్టదలుచుకోలేదు’’ అని యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
హామిల్టన్ హాల్ నుంచి నిరసనకారులను బయటకు తీసుకొచ్చిన పోలీసులు
హామిల్టన్ హాల్ నుంచి నిరసనకారులందర్ని బయటకు తీసుకొచ్చినట్లు న్యూయార్క్ పోలీసు విభాగం బీబీసీకి ధ్రువీకరించింది.
ఈ క్యాంపస్ బిల్డింగ్ను నిరసనకారులు 24 గంటల ముందు తమ అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఎంత మందిని అరెస్ట్ చేశారన్న విషయాన్ని మాత్రం న్యూయార్క్ పోలీసులు చెప్పలేదు.
అమెరికా వార్తా సంస్థ ఎన్బీసీ వివరాల ప్రకారం, 100 మంది వరకు అరెస్ట్ అయ్యుంటారని తెలుస్తుంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని చూడండి.