టీడీపీ- జనసేన కూటమి మేనిఫెస్టోలో ఏముందంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ- జనసేన కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. నీకా షాకరామీ: ఇరాన్ భద్రతా దళాలే ఈ టీనేజర్‌ను లైంగికంగా వేధించి, చంపేశాయని వెల్లడి చేసిన సీక్రెట్ డాక్యుమెంట్

  3. ‘వాంపైర్ ఫేషియల్’ వల్ల ముగ్గురు మహిళలకు హెచ్ఐవీ.. అసలేంటి ఈ ఫేషియల్?

  4. గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు ‘కుట్ర’.. వాషింగ్టన్ పోస్ట్‌ తాజా కథనంపై భారత్ ఏమన్నది?

  5. టీడీపీ- జనసేన కూటమి మేనిఫెస్టోలో ఏముందంటే..

    చంద్రబాబు, పవన్ కల్యాణ్

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ- జనసేన కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ పాల్గొన్నారు.

    ఈ కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న కొన్ని హామీలు..

    • యువతకు 20 లక్షల ఉద్యోగాలు / నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
    • స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000
    • ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం
    • ప్రతి మహిళకి నెలకు రూ.1500 (19 సం. నుంచి 59 సం. వరకు)
    • ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు
    • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
    • ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌
    • పేదలను సంపన్నులను చేసే దిశగా పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్స్‌, పార్టనర్‌షిప్‌ (పి4) పథకాలు
    • చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ
    • రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు
    • ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి
    • మెగా డీయస్సీ, ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌
    • ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటు
    • అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు
    • మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పున:ప్రారంభం-విస్తరణ
    • పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు
    • ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి
    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్‌ కావడం కోసం డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు
    • ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10 శాతం EWS రిజర్వేషన్ల అమలు, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు
    • బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ.4 వేల పెన్షన్‌ ఇస్తాం.
    • బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
    • బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.
    • స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్‌
    • చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.
    • తక్కువ జనాభాతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేటెడ్ పదవుల ద్వారా రాజకీయ భాగస్వామ్యం
    • స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం చేస్తాం.
    • రూ.5000 కోట్లతో ‘ఆదరణ’ పథకం పునరుద్ధరణ
    • అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు.
    • గొర్రెలు, మేకల పెంపకం యూనిట్‌లకు బీమా సౌకర్యం
    • చేనేత ఉత్పత్తులపై జీయస్‌టీ రీయంబర్స్‌
    • పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌
    • ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం
    • దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25 వేలు గౌరవ వేతనం.
    • షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌
    • గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% కేటాయింపు
    • స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెంపు
    • ప్రత్యేక పథకం ద్వారా పి4 మోడల్‌లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు
    • అంగన్‌వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు
    • ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పన
    • విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు
    • పండుగ కానుకలు, పెళ్లి కానుకల పునరుద్దరణ
    • సీపీయస్‌/జీపీయస్‌ విధానాన్ని పున:సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి
    • ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సి అమలు.. అలవెన్స్‌ పేమెంట్స్‌ పైన కూడా పున:పరిశీలన.. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌
    • తక్కువ జీతాలు పొందే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు
    • వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
    • పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు - ఇన్సూరెన్స్‌ సౌకర్యం - గోకులాల ఏర్పాటు - మేత కోసం బంజరు భూముల కేటాయింపు
    • గోపాలమిత్రల పునర్నియామకం దిశగా చర్యలు
    • ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసంగా రానున్న అయిదేళ్లలో రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి కాపుల సాధికారిత, అభివృద్ధి కోసం చర్యలు
    • కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత
    • కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి

    ఈ హామీలతో పాటు ఇంకా అనేక రకాల హామీలను ఈ కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

  6. ప్రజ్వల్ రేవణ్ణ ‘సెక్స్ వీడియో’ కేసు: దేవెగౌడ మనవడిపై ఫిర్యాదు చేసిన పనిమనిషి ఏం చెప్పారు?

  7. నేటి కార్టూన్..

    తమ కోవిడ్-19 టీకాతో కొన్ని అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందని ఆస్ట్రాజెనికా సంస్థ అంగీకరించింది. దీనిపై బీబీసీ కార్టూన్ ఇది..

    covid 19 vaccine, BBC cartoon
  8. గన్నవరం నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఎందుకు?

  9. ఇప్పటికింకా నా వయసు 2 ఏళ్ళే అంటున్న 101 ఏళ్ళ బామ్మ.. ఎందుకంటే..

  10. కెటామైన్: ‘మూత్రం పోయకుండా 50 మీటర్లు కూడా నడవలేను’

  11. అమిత్ షా: ‘ఒకప్పటి కంచుకోటలను వదిలి గాంధీ కుటుంబం పరుగులు పెడుతోంది’

    అమిత్ షా

    ఫొటో సోర్స్, ANI

    అమేఠీ, రాయ్‌బరేలీల నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల పోటీపై నెలకొన్న సందిగ్ధతపై కేంద్ర హోం మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు అమిత్ షా స్పందించారు.

    అస్సాంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు.

    ‘‘అసలు వారు ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో నాకు తెలియదు. కాన్ని ప్రస్తుతం నెలకొన్ని సందిగ్ధత చూస్తుంటే అసలు వారికి ఆత్మవిశ్వాసం లేనట్లు కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.

    ‘‘ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాంటే, ఒకప్పటి వారి కంచుకోటల్లాంటి సీట్లను వదిలిపెట్టి, వారు పరుగులు తీస్తున్నారు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

    ఉత్తర్ ప్రదేశ్‌లో అమేఠీ, రాయ్‌బరేలీల స్థానాలకు నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు చివరి తేదీ మే 3.

    అమేఠీలో ప్రస్తుతం బీజేపీ నుంచి స్మృతీ ఇరానీ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై ఇక్కడి నుంచి ఆమె పోటీచేసి విజయం సాధించారు. రాయ్‌బరేలీ నుంచి గత ఎన్నికల్లో సోనియా గాంధీ విజయం సాధించారు.

    అయితే, ప్రస్తుతం ఈ రెండు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ కూడా రాయ్‌బరేలీ నుంచి పోటీచేసే తమ అభ్యర్థి పేరును ప్రకటించలేదు.

    ఈ రెండు సీట్లూ గాంధీ కుటుంబానికి కంచుకోటల్లా ఉండేవి. 2004 నుంచీ రాయ్‌బరేలీలో సోనియా గాంధీ గెలుస్తూ వస్తున్నారు. మరోవైపు అమేఠీ 2004 నుంచి అమేఠీ నుంచి రాహుల్ గెలుస్తూ వచ్చారు. అయితే, 2019లో ఆయన బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, ఆ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేశారు. ఆ సీటులో మాత్రం విజయం సాధించారు.

  12. ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి

    ఫైల్ ఫోటో

    ఫొటో సోర్స్, ANI

    ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

    పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ చేపట్టేందుకు వివిధ కంటింజెట్లు నారాయణపూర్‌లోని మాధ్ ప్రాంతానికి వెళ్లాయి. అక్కడే పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు.

    ప్రస్తుతం ఆ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

    ‘‘ఇంకా ఎక్కువ మంది మావోయిస్టులు మరణించి ఉండొచ్చు. చాలా మందికి గాయాలైనట్లు ఆధారాలున్నాయి. భద్రతా బలగాలు సంఘటన స్థలం నుంచి తిరిగి వచ్చిన తర్వాత, పూర్తి పరిస్థితిని వివరించగలం’’ అని ఒక సీనియర్ పోలీసు అధికారి బీబీసీకి చెప్పారు.

    ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు చెప్పాయి. ఇది కాకుండా, మరో ఘటనలో 13 మంది మావోయిస్టులు చనిపోయారు.