ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైస్సాఆర్సీపీ మేనిఫెస్టో‌లోని ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సాఆర్‌సీపీ మేనిఫెస్టోను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. ప్రాచీ నిగమ్: స్టేట్ ‌టాపర్‌ అమ్మాయికి మీసాలు ఉన్నాయంటూ ఆన్ లైన్‌లో ట్రోలింగ్, బాధితురాలు ఏమన్నారు?

  3. హెలికాప్టర్‌లో కూర్చోబోతూ కింద పడిపోయిన మమతా బెనర్జీ

    హెలికాప్టర్ ఘటన

    ఫొటో సోర్స్, SANJAY DAS

    ప్రభాకర్ మణి తివారి, కోల్‌కతా నుంచి

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్‌లో కూర్చోబోతూ కింద పడిపోయారు. ఎన్నికల ర్యాలీలో భాగంగా ఆమె దుర్గాపూర్‌ నుంచి అసన్‌సోల్‌కు వెళ్లే సమయంలో దుర్గాపూర్‌లో శనివారం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో మమతా బెనర్జీకి పెద్దగా గాయాలు కాలేదు.

    దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సమాచారం అందించింది.

    ఈ సంఘటన జరిగినప్పటికీ, ఆమె రెండు ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ప్రసంగాల్లో దీని గురించి ప్రస్తావించలేదు.

    హెలికాప్టర్‌లో ఆమె కింద పడిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

    నెలన్నర కిందట కూడా ఆమె తలకు గాయమైంది. కాళీఘాట్ నివాసంలో కింద పడిపోవడంతో మమతా గాయపడ్డారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. షర్మిల, కౌసల్య, అనసూయ: భర్తలు కుల అహంకారానికి బలి కావడంతో వాళ్ల జీవితాలు ఎలా తలకిందులయ్యాయి?

  5. దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం వస్తుందని వీళ్లు ఏం చేస్తున్నారు?

  6. ఆంధ్రప్రదేశ్: ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్‌లు పంచారా? ప్రధాని మోదీ ఆరోపణల్లో వాస్తవమెంత...

  7. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైస్సాఆర్సీపీ మేనిఫెస్టో‌లోని ముఖ్యాంశాలు

    వైఎస్ జగన్

    ఫొటో సోర్స్, FB

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సాఆర్సీపీ మేనిఫెస్టోను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు.

    తాడేపల్లిలోని వైఎస్సాఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రకటించారు.

    మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

    • రెండు విడతల్లో పెన్షన్ రూ. 3,500 వరకు పెంపు
    • వైఎస్ఆర్ చేయూత ( 45 ఏళ్లు పైబడిన మహిళలకు )ను 4 విడతల్లో రూ. 75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు
    • వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కొనసాగింపు, నాలుగు విడతల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేలకు పెంపు
    • ఓబీసీ నేస్తం లక్షా 20 వేలకు పెంపు
    • అమ్మఒడి రూ. 15 వేల నుంచి 17 వేలకు పెంపు(75 శాతం హాజరు తప్పనిసరి)
    • వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాల కింద పొదుపు సంస్థలకు ఐదేళ్ళకు గాను రూ. 3 లక్షల రుణం
    • వైఎస్సాఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా కొనసాగింపు (10th పాస్ అవ్వాలి)
    • అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు కొనసాగింపు
    • పట్టణ గృహ నిర్మాణ పథకం కింద ప్రతీ ఏటా వెయ్యి కోట్లు కేటాయింపు, పట్టణాలలో ఉండే మధ్యతరగతి ప్రజల కోసం ఈ పథకం
    • రైతు భరోసా రూ. 13, 500 నుంచి రూ. 16, 000 వేలకు పెంపు (ప్రతీ సంవత్సరం మూడు దఫాల్లో 8000+4000+4000 అందజేత)
    • రైతులకు పంట రుణాలు కొనసాగింపు
    • మత్స్య కార భరోసా , వాహన మిత్ర పథకాల కొనసాగింపు
    • లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు వాహనమిత్ర వర్తింపు, రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా
    • లాయర్ల కు లా నేస్తం కొనసాగింపు
    • చేనేత నేస్తం కొనసాగింపు
    • స్కిల్ హబ్‌ల కొనసాగింపు
  8. హైబీపీని తేలిగ్గా తీసుకోకండి...

  9. అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి... అక్కడి ప్రభుత్వం ఏం చేస్తోంది?

  10. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్న కేటీఆర్

    బీఆర్‌ఎస్ పార్టీ

    ఫొటో సోర్స్, FB/BRS Party

    భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఎగురవేశారు.

    విజయాలకు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు.

    భవిష్యత్‌లోనూ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. భారతీయుల పొదుపు తగ్గింది, అప్పు పెరిగింది... ఎందుకిలా?

  12. ఆర్చరీ వరల్డ్ కప్: జ్యోతి సురేఖ బృందానికి బంగారు పతకం

    జ్యోతి సురేఖ

    ఫొటో సోర్స్, Getty Images

    ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

    షాంఘైలో జరుగుతున్నఈ టోర్నీ కాంపౌండ్ విభాగంలో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత బృందం చాంపియన్‌గా నిలిచింది.

    టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో 178-171తో ఆరో సీడ్ ఇటలీ జట్టుపై గెలుపొందింది.

    ఫైనల్ పోరులో భారత జట్టు కేవలం రెండుసార్లు మాత్రమే పర్ఫెక్ట్ 10 పాయింట్లను చేజార్చుకుంది.

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.