వైసీపీ తొమ్మిదో జాబితా విడుదల.. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లోని పాలక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్తల తొమ్మిదో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానానికి సమన్వయకర్తలను ప్రకటించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. సర్వేలో ఆంధ్ర ఎక్కడ? తెలంగాణ ఎక్కడ?

  3. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తొమ్మిదో జాబితా విడుదల.. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి

    vijayasaireddy

    ఫొటో సోర్స్, fb/vijayasaireddy

    ఆంధ్రప్రదేశ్‌లోని పాలక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్తల తొమ్మిదో జాబితా విడుదల చేసింది.

    ఈ జాబితాలో రెండు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానానికి సమన్వయకర్తలను ప్రకటించారు.

    నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించారు.

    కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా విశ్రాంత ఐఏఎస్ ఇంతియాజ్‌ను నియమించారు.

    మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా మురుగుడు లావణ్య పేరు తాజా జాబితాలో ప్రకటించారు. ఇంతకుముందు ఈ నియోజకవర్గానికి గంజి చిరంజీవిని నియమించగా ఇప్పుడు ఆయన స్థానంలో లావణ్యను నియమించారు.

  4. పుతిన్ ‘అణు యుద్ధం’ అంటూ ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు?

  5. రామేశ్వరం కేఫ్ ఘటన బాంబు పేలుడే

    రామేశ్వరం కేఫ్ పేలుడు

    ఫొటో సోర్స్, CC TV footage/Karnataka Police

    రామేశ్వరం కేఫ్ పేలుడుకు కారణం బాంబ్ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విలేఖరులతో చెప్పారు.

    దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

    బెంగళూరు నగరం వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఈ పేలుడులో 9 మంది గాయపడ్డారు.

    క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    నిందితులకు శిక్ష పడుతుందని సిద్ధరామయ్య అన్నారు.

    రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు సీఎం సూచించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  6. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు దాటిన ఊబకాయులు, భారత్‌లో పురుషుల కంటే మహిళల్లోనే స్థూలకాయం అధికం

  7. బీఆర్ఎస్‌ పార్టీకి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా

    బీబీ పాటిల్

    ఫొటో సోర్స్, Facebook/BBpatil

    ఫొటో క్యాప్షన్, బీబీ పాటిల్

    బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జహీరాబాద్ లోకసభ సభ్యులు బీబీ పాటిల్ రాజీనామా చేశారు.

    పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావుకు ఆయన శుక్రవారం రాజీనామా లేఖను పంపారు.

    జహీరాబాద్ ప్రాంతానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు బీబీ పాటిల్ లేఖలో ధన్యవాదాలు తెలిపారు.

    ఇవాళ ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

    బీబీ పాటిల్ రాజీనామా లేఖ

    ఫొటో సోర్స్, BBPatil

    ఫొటో క్యాప్షన్, బీబీ పాటిల్ రాజీనామా లేఖ
  8. బెంగళూరులోని కేఫ్‌లో పేలుడు, నలుగురికి గాయాలు

    కేఫ్‌లో పేలుడు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, పేలుడు కారణంగా కేఫ్‌లోని కొంతమంది గాయపడ్డారు.

    బెంగళూరు నగరం వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడులో పలువురు గాయపడ్డారు.

    పీటీఐ వార్తాసంస్థ ప్రకారం పేలుడు కారణంగా కేఫ్‌లోని నలుగురు గాయపడ్డారు.

    క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని, మంటలు ఆర్పివేశాయని ఒక సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో తెలిపారు.

    ఘటన మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్యలో జరిగిందని, ఆ సమయంలో లంచ్ కోసం కేఫ్‌లో జనం గుమిగూడి ఉన్నారని చెప్పారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

    కాగా, పేలుడుకు గల కారణాలపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

    (ఈ వార్త అప్‌డేట్ అవుతోంది)

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  9. దిల్లీ అల్లర్లు: నాలుగేళ్లలో వందలాది ఎఫ్ఐఆర్‌లు, అరెస్టులు... ఎంతమందికి న్యాయం దక్కింది?

  10. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు - పేటీఎం మధ్య అంతర్గత కంపెనీ ఒప్పందాలు రద్దు

    పేటీఎం

    ఫొటో సోర్స్, Getty Images

    పేటీఎం, దాని పేమెంట్స్ బ్యాంకు యూనిట్‌ మధ్యలో ఉన్న పలు అంతర్గత కంపెనీ ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు శుక్రవారం పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్ ప్రకటన జారీ చేసింది.

    పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు అంగీకరించినట్లు పేర్కొంది.

    పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు 51 శాతం వాటా ఉంది. ఇటీవలే ఆయన పేమెంట్స్ బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

    పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసేందుకు మార్చి 15 వరకు కంపెనీకి భారతీయ రిజర్వు బ్యాంకు గడువు ఇచ్చింది.

    పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తుందని తాము విచారణలో గుర్తించినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు తెలిపింది.

  11. ఇజ్రాయెల్-గాజా యుద్ధం: సహాయ సామగ్రి వాహనాలపై కాల్పులు, 100 మందికి పైగా మృతి... ఇది ఇజ్రాయెల్ సృష్టించిన నరమేధమన్న హమాస్

  12. 'ఉత్తరకాశీ సొరంగం నుంచి 41 మందిని కాపాడాను, ప్రతిఫలంగా మా ఇంటిని కూల్చేశారు' -ర్యాట్ హోల్ మైనర్ వకీల్ హసన్

  13. బంగ్లాదేశ్ ఢాకాలో భారీ అగ్నిప్రమాదం, 43 మంది మృతి

    బంగ్లాదేశ్‌లో అగ్నిప్రమాదం

    ఫొటో సోర్స్, Reuters

    బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బహుళ అంతస్తుల భవనంలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో 43 మంది చనిపోయారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.

    గురువారం స్థానిక సమయం ప్రకారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత భవనమంతా మంటలు చెలరేగాయని తెలిపాయి. ఈ భవనంలో ఏడు అంతస్తులు ఉన్నాయి.

    ఈ భవనంలో ఇతర రెస్టారెంట్లు, పలు బట్టల దుకాణాలు, మొబైల్ ఫోన్ షాపులున్నాయి.

    ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

    ఢాకాలో అగ్నిప్రమాదం

    ఫొటో సోర్స్, EPA

    మహిళలు,చిన్నారులతో సహా 33 మంది ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మరణించారని బంగ్లాదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సమంతా లాల్ సేన్ తెలిపారు.

    నగరానికి చెందిన మెయిన్ బర్న్స్ ఆస్పత్రిలో మరో 10 మంది మృతి చెందారని చెప్పారు.

    75 మందిని ఈ ప్రమాదం నుంచి కాపాడారు. డజన్ల కొద్దీ ప్రజలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

    ‘‘మంటలు చెలరేగిన సమయంలో మేం ఆరవ అంతస్తులో ఉన్నాం. మెట్ల ద్వారా కిందకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాం’’ అని రెస్టారెంట్ మేనేజర్ సోహెల్ వార్తా సంస్థ ఏఎఫ్‌పీకి తెలిపారు.

    పగిలిపోయిన కిటికీ నుంచి తాను తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని మరో వ్యక్తి మహ్మద్ అల్తాఫ్ చెప్పారు.

    ప్రజలు బయటికి వెళ్లేందుకు సాయపడ్డ తన ఇద్దరు సహోద్యోగులు, మంటల్లో చిక్కుకుని చనిపోయారని చెప్పారు.

  14. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: 10 వేల మంది హమాస్ ఫైటర్లను చంపామని ఇజ్రాయెల్ ప్రకటన... బీబీసీ వెరిఫైలో తేలిందేంటి?

  15. బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    నమస్తే.

    తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.