బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు కలుద్దాం.
సెప్టెంబర్ 9, 10 తేదీలలో నిర్వహించనున్న జీ 20 సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు కలుద్దాం.

ఫొటో సోర్స్, ANI
సెప్టెంబర్ 9, 10 తేదీలలో నిర్వహించనున్న జీ 20 సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి.
వివిధ దేశాల నేతలు ఈ సమావేశాలలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా దిల్లీలోని అనేక ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న కటౌట్లు చర్చనీయమవుతున్నాయి.
ఈ కటౌట్లన్నీ కొండముచ్చుల బొమ్మలతో ఉంటున్నాయి. నగరంలోని కోతులను భయపెట్టేందుకు ఇలా కొండముచ్చుల ఫొటోలతో కటౌట్లు ఏర్పాటుచేస్తున్నారు.
కోతులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో కొండముచ్చుల కటౌట్లు ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారంటూ పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది.
మరోవైపు కొండముచ్చుల్లా అరిచేందుకు సుమారు 40 మందికి శిక్షణ కూడా ఇచ్చి, కోతులను భయపెట్టేందుకు కొండముచ్చుల్లా అరిచే పనిలో నియమించినట్లు పీటీఐ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్లోని కొన్ని ప్రాంతాలను చైనా తన భూభాగాలుగా గుర్తిస్తూ కొత్త మ్యాప్ విడుదల చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
బుధవారం ఉదయం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఇది చాలా సీరియస్ అంశమని అన్నారు.
''లద్దాఖ్లో అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని మోదీ అంటున్నది అబద్ధమని ఏళ్లుగా చెబుతూనే ఉన్నాను. మన భూమిని చైనా లాక్కుందని లద్దాఖ్ మొత్తానికి తెలుసు. చైనా మ్యాప్ అంశం చాలా తీవ్రమైనది. వాళ్లు భూమిని తీసుకున్నారు. ప్రధాని స్పందించాలి'' అని రాహుల్ గాంధీ మీడియాతో అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లకు స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.