ఎస్సీ వర్గీకరణ, టెన్త్ పాసైతే రూ. 10 వేలు, డిగ్రీ చదివితే రూ. 25 వేలు, పీహెచ్‌డీ చేస్తే రూ. 5 లక్షలు- కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు ‘ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్’ ప్రకటించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. క్రికెట్: ఐబీఎస్ఏ వరల్డ్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత అంధుల క్రికెట్ మహిళల జట్టు

    'ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐబీఎస్ఏ)' వరల్డ్ గేమ్స్‌లో భారత అంధ మహిళల క్రికెట్ జట్టు బంగారు పతకం సాధించింది.

    శనివారం జరిగిన టీ20 ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో గెలిచింది.

    ఐబీఎస్ఏ గేమ్స్ ఆస్ట్రేలియాలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఎస్సీ వర్గీకరణకు చర్యలు.. టెన్త్ పాసైతే రూ. 10 వేలు, డిగ్రీ చదివితే రూ. 25 వేలు, పీహెచ్‌డీ చేస్తే రూ. 5 లక్షలు- కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఇదీ

    చేవెళ్ల సభలో రేవంత్, మల్లికార్జున ఖర్గే

    ఫొటో సోర్స్, telangana congress

    తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు ‘ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్’ ప్రకటించారు.

    సోనియా గాంధీ సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

    రేవంత్ రెడ్డి

    ఫొటో సోర్స్, Telangana congress

    ఎస్టీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని ప్రధానాంశాలు

    • ఎస్సీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను 18 శాతానికి పెంచడం, ఎస్సీ రిజర్వేషన్లలో ఏ, బీ, సీ, డీ వర్గీకరణకు చర్యలు
    • అంబేడ్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షలు
    • కాంట్రాక్ట్ పనుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు. ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ కంపెనీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కల్పన
    • ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఇంటి స్థలం, నిర్మాణానికి రూ. 6 లక్షలు
    • సమ్మక్క, సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం కింద తండా, గూడెం గ్రామ పంచాయతీలకు ఏడాదికి రూ. 25 లక్షల గ్రాంట్
    • 3 కొత్త ఎస్సీ కార్పొరేషన్లు 1) మాదిగ కార్పొరేషన్, 2) మాల కార్పొరేషన్, 3) ఇతర ఎస్సీ ఉప కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్‌కు ఏడాదికి రూ. 750 కోట్ల గ్రాంట్
    • 3 ఎస్టీ కార్పొరేషన్లు.. 1) తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, 2) సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, 3) ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్‌కు ఏటా రూ. 500 కోట్ల గ్రాంట్
    • అర్హులందరికీ పోడు భూములకు పట్టాలు
    • తెలంగాణలో కొత్తగా 5 మైదాన ప్రాంత ఐటీడీఏలు నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఏర్పాటు. అన్ని ఐటీడీఏ హెడ్ క్వార్టర్లలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం.
    • విద్యా జ్యోతులు పథకం కింద.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ. 10 వేలు ఇస్తారు. ఇంటర్మీడియట్ పాసైతే రూ. 15 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ. 25 వేలు, పీజీ చదివితే రూ. లక్ష ఇస్తారు. ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేస్తే రూ. 5 లక్షలు.
    • గ్రాడ్యుయేషన్, పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గురుకుల పాఠశాల
    చేవెళ్ల సభలో రేవంత్

    ఫొటో సోర్స్, telangana congress

  4. లూయిస్ రుబియాలెజ్: జెన్నీ హెర్మసో పెదవులపై ముద్దు పెట్టి పదవి పోగొట్టుకున్నాడు

    Luis Rubiales

    ఫొటో సోర్స్, Getty Images

    స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్ రుబియలెజ్‌ను ఫిఫా సస్పెండ్ చేసింది.

    ఫుట్‌బాల్ మహిళా ప్రపంచకప్‌ను స్పెయిన్ జట్టు గెలుచుకున్న తరువాత ఆ జట్టు క్రీడాకారిణి జెన్నీ హెర్మసోను లూయిస్ ముద్దు పెట్టుకున్నారు. ఆమె పెదవులపై లూయిస్ ముద్దు పెట్టడం వివాదానికి దారితీసింది.

    దీంతో లూయిస్‌ను రాజీనామా చేయాలని ఫిఫా కోరినప్పటికీ ఆయన అందుకు అంగీకరించలేదు. దీంతో ఆయన్ను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అన్ని రకాల ఫుట్ బాల్ సంబంధిత కార్యక్రమాల నుంచి ప్రాథమికంగా సస్పెండ్ చేశారు.

    ‘ఈ రోజు నుంచి సస్పెన్షన్ అమలులోకి వస్తుంది. మొత్తం 90 రోజుల పాటు ఈ సస్పెన్షన్ ఉంటుంది’ అని ఫిఫా వెల్లడించింది.

  5. కార్గిల్: డీజిల్ లేకుండా గాలితో నడిచే భారీ నౌక

  6. కూబర్ పెడీ: ఇక్కడ ప్రజలు భూగర్భంలో నివసిస్తారు - మండు వేసవిలో కూడా ఏసీ లేకుండా హాయిగా ఉంటారు

  7. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్న వీడియో విడుదల చేసి ఇస్రో

    చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది.

    చంద్రుడి దక్షిణ ధ్రువంలోని రహస్యాలు తెలుసుకోవడానికి ‘శివశక్తి పాయింట్’లో ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతోందని పేర్కొంటూ ఇస్రో ఈ వీడియోను ట్విటర్ వేదికగా విడుదల చేసింది.

    ఆగస్ట్ 23న సాయంత్రం చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడిపై దిగింది. అనంతరం ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చి చంద్రుడిపై తిరుగుతోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. ‘బాయ్స్ హాస్టల్` రివ్యూ: వార్డెన్‌ని చంపింది ఎవ‌రు?

  9. చంద్రయాన్ 3 దిగిన ప్రదేశం పేరు శివశక్తి పాయింట్

  10. హెయిర్ ఫాల్: మీ జుట్టు రాలిపోతోందా, ఆడవాళ్లకు పోనీ టెయిల్ మంచిది కాదా?

  11. చంద్రయాన్-3: విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ పని చేసేది 14 రోజులేనా, తర్వాత ఇవి ఏమవుతాయి?

  12. తెలంగాణలో టేకు చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి?

  13. బ్రేకింగ్ న్యూస్, మదురైలో యాత్రికులతో వెళ్తున్న రైలులో అగ్నిప్రమాదం, 9 కి చేరిన మృతులు సంఖ్య

    రైలు ప్రమాదం

    తమిళనాడులోని మదురై రైల్వే స్టేషన్‌కి సమీపంలో రైలుకి మంటలు అంటుకోవడంతో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు.

    మీడియా రిపోర్ట్‌ల ప్రకారం, ఆగస్ట్ 17న 60 మందికి పైగా యాత్రికులు లఖ్‌నవూ నుంచి రైలులో తీర్ధ యాత్ర కోసం తమిళనాడుకు బయలుదేరారు.

    మదురై రైలు ప్రమాదం

    శనివారం ఉదయం ఈ యాత్రికులు మదురై చేరుకున్నారు. శుక్రవారం నాడు వీరు నాగర్ కోయిల్‌లో ఉన్న పద్మనాభ స్వామి ఆలయాన్ని వీరు దర్శించుకున్నారు.

    మదురై రైల్వే స్టేషన్‌కి ఒక కిలోమీటర్ దూరంలో రైలు ఆగి ఉండగా, ఒక కోచ్‌కి మంటలు అంటుకున్నాయి.

    రైలుకు అగ్ని ప్రమాదం
    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    రైలులో ఉన్న యాత్రికులు కొందరు సిలిండర్‌పై టీ పెట్టుకునేందుకు ప్రయత్నించగా.. రైలు కోచ్‌కి ఈ మంటలు అంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు బీబీసీకి చెప్పారు.

    ఈ విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రమాదం తర్వాత ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి. నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడక్లిక్చేయండి.