ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....
గుడ్ నైట్.
ఇలాంటి చర్యలు ప్రతిపాదించినందుకు జయంత్ పాటిల్, జితేంద్ర అవహద్ల సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా తాను స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు అజిత్ పవార్ వెల్లడించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, ANI
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తమ పార్టీలో తిరుగుబాటు చేసి ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిస్తున్న నేతలపై చర్యలు ప్రారంభించారు.
ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శరద్ పవార్ ట్విటర్లో తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే వీరిపై చర్యలు తీసుకున్నట్లు పవార్ తెలిపారు.
కొద్ది రోజుల కిందటే ప్రఫుల్ పటేల్ను ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పవార్ నియమించారు.
వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీపీ నేత, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సోమవారంనాడు శరద్ పవార్కు లేఖ రాశారు.
మరోవైపు, అజిత్ పవార్ సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలకు సిఫారసు చేస్తూ ఎన్సీపీ మహారాష్ట్ర క్రమశిక్షణా కమిటీ తీర్మానం చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎన్సీపీ మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
"వీరంతా జూలై 2న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు, పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు" అని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
జయంత్ పాటిల్పై చర్యలు తీసుకుంటాం: అజిత్ పవార్
ఈ వ్యవహారంపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, తమ 9 మంది ఎమ్మెల్యేలపై ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ క్రమశిక్షణా చర్యలను ప్రతిపాదించినట్లు తనకు మీడియా రిపోర్టుల ద్వారా తెలిసిందని అన్నారు.
ఇలాంటి చర్యలు ప్రతిపాదించినందుకు జయంత్ పాటిల్, జితేంద్ర అవహద్ల సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా తాను స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు అజిత్ పవార్ వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు జోరు కొనసాగించింది.
లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్పై 43 పరుగులతో గెలుపొందింది.
ఈ విజయంతో సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ను ఎంచుకుంది.
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 416 పరుగులకు ఆలౌటైంది.
స్టీవ్ స్మిత్ (184 బంతుల్లో 110; 15 ఫోర్లు) సెంచరీ చేశాడు. డేవిడ్ వార్నర్ (66; 8 ఫోర్లు, 1 సిక్స్), ట్రావిస్ హెడ్ (77; 14 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జట్టు 325 పరుగులకు ఆలౌటైంది.
బెన్ డకెట్ (98) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 279 పరుగులకు ఆలౌటవ్వడంతో, ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యం నిలిచింది.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 327 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 43 పరుగులతో గెలుపు దక్కింది.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 214 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 155 పరుగులు చేశాడు.
బెన్ డకెట్ (83; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు.
ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజెల్వుడ్ తలా మూడు వికెట్లు తీసుకున్నారు.
యాసెస్ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్లు ఉన్నాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.